పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/395

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

340

తాలాంకనందినీపరిణయము


తఱువాత కురురాజతనయునకును కన్య
        నీయఁగా నొకలగ్న మిడుటయును
నందుకు తల్లి దా నర్ధరాత్రిని లేచి
        యభిమన్యుఁ డడవుల కరుగుటయును


గీ.

నట ఘటోత్కచుఁ డనుకూలుఁడైన పిదప
దానవుఁడు ధౌర్త్యమాయావిధానములను
తరలివచ్చిన కౌరవతతులనెల్ల
వెతలఁ బెట్టుటఁ దెల్పెద విను బిడౌజ.

46


తే.

అన్న యన్న మాట కర్ధరాత్రమునందు
కొడుకుతో సుభద్ర యడవి కఱుఁగ
విల్లునమ్ము లరసి వీరుఁ డంచని పార్థ
సుతునితో ఘటోత్కచుండు గవిసె.

47


ఉ.

ఆయభిమన్యుఁడు దనుఁజుఁ డన్నలు దమ్ములు నౌ టెఱుంగమిం
బాయని రోషభీషణత బాహుబలంబులఁ బోరునంత నే
నాయెడ కేగుదెంచి యుభయత్రల చుట్టఱికంబు దెల్పఁగా
నాయువుదక్కి వారికి ప్రియంబున సౌహృదభావ మేర్పడెన్.

48


మ.

తనయుండైన ఘటోత్కచుం గని సుభద్రాదేవి యాసీరి త
న్నును నిర్మానుషవాక్యము ల్దెలుప నుగ్రాకారుఁడై తత్క్షణం
బున ద్వారావతికేగి యాహలిగృహంబున్ మాయచే జొచ్చి క
న్య నదృశ్యాకృతి తోడిదెచ్చి యభిమన్యస్వామి కొప్పించియున్.

49


క.

ఆకన్యకాకృతిం దా
గైకొని లక్ష్మణుని లగ్నకాలంబున దు
ర్భీకరరూపము జూపి చి
కాకున వా డచఱి పాఱఁగా వడి దఱిమెన్.

50


క.

మాయాకన్యక నంతట
మాయము గావించి యభ్రమండలమున దు