పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/394

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

339


మెచ్చ వసింపఁజేసి మతిమించిన భక్తి నుతించి కూర్మిమై
నచ్చుపడ న్ముఖాంచితకరాంజలుఁడై వచియించె నమ్రతన్.

40


ఉ.

దేవర లెందునుండి చనుదెంచితిరో! గత మేమొ! పాండుపు
త్రావలి సంపద ల్గొని యహంకృతితోడ సుయోధనుండు స
ద్భావుకుఁడై సుఖించునెగదా ! విజయం డిట నున్నవాఁడు యిం
కీవల చిత్రమేమొ వచియింపఁగదే సురసంయమీశ్వరా!

41


చ.

మఱి యిదిగాక నిప్పు డభిమన్యుని బెండి లటంచు దానవే
శ్వరుఁడు ఘటోత్కచుండు త్రిదశప్రయుతంబుగ నన్ను నర్జునున్
బరువడి రమ్మటంచు శుభపత్రిక వ్రాసినవాఁడు నేఁడు యి
త్తెఱఁ గెటువంటిదో! మదికి తేఁటపడన్ వివరింపవే దయన్.

42


ఉ.

ఎక్కడివార్తయో దనుజుఁ డేగతి నీశుభకార్య మెన్న డే
దిక్కున నాచరించునో సతీమణి యెవ్వరికూఁతు రెట్టులీ
చక్కి బొసంగునో యనుచు సందియమొందుచు సవ్యసాచి నే
నెక్కడ దోఁచకంగలగ నింతటిలో మిముగంటి మున్నతిన్.

43


క.

ఇది వినినప్పుడె మోదా
స్పద మయ్యెంగాని దీని సాకల్యముగా
మది దెలియకున్న ద్రిజగ
ద్విదితాత్ములు మీకు విన్నవింపఁగవలసెన్.

44


చ.

అనిన సురర్షి యిట్లనియె నద్రీనిసూదన కౌరవేశ్వరుం
డనుపమభోగవైభవము లందెను దాని నటుండనిమ్ము సొం
పెనయ ఘటోత్కచుండు లిఖింయించిన యీశుభలేఖ భావమే
పనిబడి నీకు పార్థునకు బాల్చడి తెల్పఁగ నేగుదెంచితిన్.

45


సీ.

ఆద్వారకను సుభద్రాభిమన్యులు నుండ
        బలునకు శశిరేఖ గలుగుటయును
దాని మేనల్లున కే నొసంగెద నంచు
        భగినీమణికి నమ్మబలుకుటయును