పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/393

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

338

తాలాంకనందినీపరిణయము


వ్రేయన్ వాసవవాసవీప్రముఖుల న్వీక్షించి వేగం బిటం
డాయె న్వచ్చెద ఱింతకన్న మదిజూడన్ లే దుపాయం బికన్.

34


చ.

మది నిది నిశ్చయించి యభిమన్యసుభద్రల కిత్తెఱంగు స
మ్మద మొనరించి యుద్వహసుమంగళపత్రికయున్ లిఖించి నె.
మ్మది ననిలాస్త్రమం దనుపమానముగా ఘటియించి వేసె నా
త్రిదశసభన్ బిడౌజముఖదేవగణం బతిచిత్ర మందఁగన్.

35


ఉ.

ఆమహదస్త్రరాజ మపు డర్జునుఁడున్ శతమన్యుఁ డున్న చిం
తామణిభద్రపీఠిని ద్రుతంబున వ్రాలిన నంతలోన సు
త్రామముఖామరాళి ప్రమదంబున గన్గొని తన్నిబద్ధమై
ప్రేమ నలంకరించు శుభలేఖను గైకొని వేవచింపఁగన్.

36


ఉ.

"శ్రీకరసర్వదిగ్వరవశీకరబాహుబలిప్రతాపుఁ డౌ
పాకవిభేదిసన్నిధికి ప్రాంజలుఁ డౌచు ఘటోత్కచుం డనే
కైకనమస్కృతోక్తి లిఖియించిన విన్నపపత్రిక న్మదిం
గైకొని మన్మనోరథ మఖండగతి న్నెరవేర్చ వేడెదన్.

37


చ.

మది ముదమందగా నిపుడు మాయభిమన్యుని పెండ్లికై సమ
స్తదివిజులన్ బృహస్పతికృశానుముఖాఖిలదిగ్వరు ల్ప్రియం
బొదవఁగ నర్జును న్సుతమహోత్సవలగ్నవిలోకనార్థమై
సదయత బోధఁజేసి తమసన్నిధితోడుక రాదగుం జుమీ.”

38


క.

ఈరీతిం జదివి సునా
సీరుం డర్జునుఁడు వెఱగు జెందెటివేళన్
ద్వారావతినుండి మహో
దారుఁడు నారదుఁడు తనకుతాఁ జనుదెంచెన్.

38


ఉ.

వచ్చిన సంయమీంద్రునకు వజ్రి శచీసతితోడ గూడి వి
వ్వచ్చుఁడు దా నెదుర్కొని సువర్ణమణిస్థగితాసనంబునన్