పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/392

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

షష్ఠాశ్వాసము

337


తండోపతండవేదండప్రకాండ ము
        ద్దండమై యిక్కొండనిండ నుండ
నల్లదే భయభూతభల్లఝల్లీవ్రాత
        హల్లధ్వనులఁ దల్లడిల్లఁజేయు
నాలంబునను టోరి జాలంబులై దూరి
        కోలంబు లీదారి గోలలాడ


తే.

గాన యీకాన కెనయఁగా గానమనియ
నూనతామనసానుమోదానుగతిని
సానువులమంజుకుంజవితానములను
గడచి కతిపయదినశీఘ్రగతుల నడచి.

30


చ.

అని యిటుల న్నుతించి వికటాటవి మించి గమించి మించి భీమనం
దనునిగుఱించి చిత్రఘటితక్రియ లెల్ల దలంచి విస్మయం
బున మది నుత్సహించి నిజపుత్రిఁ గనుంగొను వాంఛ నుంచి య
ల్లన జనుదెంచి తద్ఘనబిలస్థలి గాంచి రుదంచితంబుగాన్.

31


ఉ.

అంతకుమున్ ఘటోత్కచుఁ డహార్యగుహాంతరసీమఁ జేరి దా
నెంతయుఁ బోయివచ్చు తెఱఁ గెల్ల సుభద్రకు దెల్పుచుం బ్రలం
బాంతకుఁ డచ్యుతుండు సుత నల్లుని దోడ్కొనిపోయి పెండి ల
త్యంతముదంబునన్ సలుప నర్థిని వే జనుదెంతు రెల్లియున్.

32


మ.

అని యాద్యంతము దెల్పుచో హృదయమం దయ్యర్జునుం డెట్టు లీ
తని కల్యాణమహోత్సవంబు గనుసందర్భంబు బాటించునో!
యని యాఖండలుతో సుధర్మసభయం దర్ధాసనాసీనుఁడై
యునికిం గాంచి యుపాయ మొక్కగతి దా నూహించె నుత్సాహియై.

33


శా.

శ్రేయోభూతము గాగ నుద్వహశుభశ్రీలేఖికల్ వ్రాసి నా
వాయవ్యాస్త్రము కంటగట్టి దినము న్బాటించి నేసూటిగా