పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/371

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

316

తాలంకనందినీపరిణయము


గలిగిన వీరపత్ని తనుగావున ని ట్లొనరించె దానవుం
డలఘుపరాక్రముండు భవదాశయ మించుక సాగనిచ్చునే.

263


తే.

దానవుఁడు బూను మాయావిధానములకు
ప్రస్తుతోద్యు క్తసత్కారఫణితి నెఱిఁగి
యుపమచే సంధి గావించు టుచిత మనుచుఁ
బలుకు హరితోడ హలి మాఱుపలుకకుండె.

264


మ.

అవుగా దంచని మాఱుబల్కని ప్రలంబారాతిభావంబు దై
త్యవరేణ్యుండు మదిం గ్రహించి హరిసత్యాలాపముల్ మెచ్చి కౌ
రవనిశ్శేష మొనర్పకున్న హలిసంరంభంబు బోవీడ డం
చు వియన్మార్గమునం దదృశ్యగతుఁడై శుంభత్రృతాపంబునన్.

265


మ.

పునరుత్పాత మొనర్ప దైత్యుఁడు నభోభూగర్భము ల్నిండ చి
ట్లన చీఁక ట్లొనరించి యార్చి భువనాటోపంబు దీపింప ధా
రుణి యక్కుమ్మరిసారెరీతి పలుమాఱుం దిర్దిరం ద్రిమ్మరం
గనులంజూడ భయంకరాకృతిని భూకంపంబు గల్పించియున్.

266


మ.

దివి యొక్కుమ్మడి గ్రుంగి పైఁబడినరీతిం జంద్రమాదిత్యు ల
వ్యవధిం తారలతో ధర న్మెఱుఁగుఛాయన్ సప్తసింధువ్రజం
బవియం జొచ్చినభంగి, జాజ్వలితకీలాభీలదావానల
స్రవకల్పాంతములీల నొప్పె సుర లాశ్చర్యంబుగా జూడఁగాన్.

267


చ.

కినుకను దత్క్షణంబె నిజకింకరకోటిని బిల్వ వార లు
గ్రనిరతి రోషభీషణముఖంబుల నద్భుతశూలధారులై
జనవరసేనలం గవిసి సాహసబాహుసమగ్రగశక్తి బె
క్కొని వడినార్చి బేర్చి 'శలగోశలగో' యని గ్రుమ్మి రొక్కటన్.

268


గీ.

దవిలి బలకృష్ణు లిరువురు దక్క నిఖిల
కరితురంగమరథసైనికానికాయ