పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/367

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

312

తాలాంకనందినీపరిణయము


గావున నీ వెఱుంగనిది గల్గునె లోకమునందు నెందు నేఁ
డీవిధ మెట్టిదో తెలుపవే మధుసూదన వైరిభేదనా!

240


చ.

అనిన జనార్దనుండు దరహాసముఖంబున నన్నతోడ ని
ట్లనియె మదగ్రజుండ విటు లాడఁగనేల యెఱింగి మున్ను చే
సినపని నింతలో మఱచి చింతిల నేటికి నీవె సోదరిం
గినిసి పరాభవించుటకు కేవల మిట్లొనగూడు టబ్రమే.

240


మ.

తొలుత న్నీవు పరాభవించుటకు పుత్రు న్వెంట దోడ్కొంచు కే
వలగాఢాంధతమంబునన్ వెడలిపోవం దుర్గమార్గాటనో
జ్జ్వలబాహాబలుఁడౌ ఘటోత్కచుఁ డట న్సాహాయ్యమై వారి న
బ్బలుకోనన్ నిలజేసి నిశ్చలసుహృద్భావంబుఁ బాటించినన్.

241


తే.

వానితోడుత నీవన్న వార్త లెల్ల
దెలుప దానవుఁ డతిరోషదీప్తుఁ డగుచుఁ
దల్లికిని దమ్మునకుఁ బ్రియం బుల్లసిల్ల
పొలఁతి నింతకుమున్నె గొంపోయె నటకు.

243


క.

అతఁ డతులదనుజమాయా
చతురతలన్ విభ్రమించి శశిరేఖాయో
షితరూపము గైకొని భవ
దతులితభవనమున మోహనాకృతి నిలిచెన్.

244


క.

వనితామణి నితరజనుల్
గనుఁగొన శశిరేఖవలెనె గాన్సించుచు ల
క్ష్మణున కతివికృతరూపము
లను జూపెం దనుజమాయలన్ వివిధగతిన్.

245


చ.

జనకులదుఃఖముల్ హృదయశల్యములై మదినాటియుంటచే
దనుజుఁడు లక్ష్మణుం గలచెఁ దత్కురురాడ్బలమెల్ల నార్చి తెం