పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/362

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

307


చ.

నిను మది నమ్మి వచ్చు ధరణీతలనాథులు మద్భుజావలే
పనఘనబాణజాలదవపావకకీలల మ్రొగ్గి మ్రగ్గి రిం
తను మును మాయజూదమున ధర్మజు రాజ్యము గెల్చి నీ కొసం
గినఘనశూరు సౌబలుని గీటణఁగించెద చూడు మింతటన్.

210


గీ.

ధర్మజాదిమపాండునందనుల కీవు
కీడొనర్చిన ఫలము చేకూరె నేఁడు
శకునిభానుజసైంధవసహితముగను
నిన్ను జంపక మాన నాకన్ను లాన.

211


చ.

అని యతఁ డట్టహాసమున నార్చి నిశాతశరాశ్మవజ్రపా
తనిహతిచే మహారథుల దర్పము లార్పఁగ డస్సి సైనికుల్
జను లతిభీతి బర్వ నిల శక్యము గాక కృపుండు ద్రోణుఁ డ
జ్జనపతితోడ కార్యసువిచారనయోక్తుల బల్కి రొక్కటన్.

212


క.

కురునాథ! యిట్టి నీ వె
క్కుఱుమంత్రాంగమున నింత గూడెను మనతో
డరుదెంచు నృపులు దిశలం
బఱచిరి హతశేషు లగుచు బ్రతికినవారల్.

213


గీ.

మాయగజములచే మ్రగ్గె మనగజములు
మాయహయములచే గూలె మనహయములు
మాయరథములచే డుల్లె మనరథములు
మాయసేనచె మనసేన మాయమాయె.

214


మ.

మొదల న్పాండవపక్షపాతి హరి యేమో వింత గావించె ని
ట్లదిగాకం బురుహూతముఖ్యసుర లత్యంతాప్తులుం గాన నె
య్యది సాహాయ్య మొనర్చిరో తెలియరా దీమాయ లీఛాయ లి
ట్లొదవెం గావున దీనికై ప్రతికృతం బూహింపఁగా దోచదే.

215


మ.

మును భీష్మాదులు నీహితమ్ముకొఱకై ముమ్మారు బోధించి యి
ప్పని సేయం దగదంచు బల్కుట మదిం బాటించఁగా లేక స