పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/361

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

306

తాలాంకనందినీపరిణయము


తింతగ వ్రక్కలించి యితరేతరకోటి కదృశ్యరూపుఁడై
యంత వియత్పథంబునకు నాగ్రహుఁడై చనుదెంచి క్రమ్మఱన్.

205


సీ.

మరల కర్ణునిశిరోమధ్యంబున నిగిడ్చె
        సునిశితాస్త్రంబుల శూలములను
పాషాణతతుల దుర్భరగదాహతుల చే
        డ్పడజేసె నంత సౌబలునిబలము
సముదగ్రలీల దుశ్శాసను తనువెల్ల
        పరశుఘాతంబుల బగల నణఁచె
చటులాశనీమహార్భటనిపాతంబుల
        రారాజురథ్యసారథుల దునిమె,


తే.

సైంధవుని కత్తళము ద్రుంచె సకలయోధ
తతిని భూరిశ్రవుని ద్రోణతనయు నొకట
ఘోరతాడనముల మూర్చగొన నడంచె
ఘనతచే మించె నభ్రవీథిని నటించె.

206


చ.

మును తనతో సుభద్ర కురుముఖ్యుల జంపకు మంచు బల్కుటల్
మనమున నెంచి వారివధ మాత్రము మాని తదీయసైనికా
జనముల నొక్కయుద్ధవిడి జంపి పురీషకరీషమూత్రమ
జ్జనమున నమ్మహారథుల శక్తి నణంచె ననేకభంగులన్.

207


క.

ఈరీతి న్మాయాకృత
ధారాధరములను డాగి తత్కురుబలముల్
భీరుపడ భంగపఱచుచు
రారాజుం గూర్చి భీమరవమున బలికెన్.

208


చ.

జనకు లరణ్యభూమి ననిశంబు జరింపఁగ బంపినాఁడ నం
చని మదగర్వహుంకృతిని నయ్యభిమన్యుఁడు గోరియున్న క
న్యను గొఱగాని లక్ష్మయిన కర్థిని గైకొనబూని పాండునం
దనుల పరాక్రమంబు మదిదల్పని దత్ఫల మబ్బె నేటికిన్.

209