పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/356

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

301


ఉ.

ఈగతి మాయనొందిన మదేభరథాశ్వభటాదు లొక్కటన్
మూగిన రాజసైన్యములు మ్రొగ్గే తురంగము లార్చుచుం ధరం
దోగె మధేభసంఘములు దుత్తుము రయ్యె రథంబు లుర్వి వే
వేగ దొఱంగె వాసవపవిప్రహతాద్రులభంగి భంగమై.

189


సీ.

భల్లపంక్తులు చిత్తజల్లులై వర్షింప
        తల్లడిల్లుచు నేల దొర్లువారు
మిన్ను జూడఁగ బోవ మెఱుఁగుటమ్ములు నాట
        కనుగ్రుడ్డు లూడి బెగ్గటిలువారు
తలమీఁద పిడుగు లుధ్ధతిగూల తనువులు
        నుగ్గునుగ్గుగ నేల మ్రగ్గువారు
ఖడ్గముల్ బూని లంఘనసేయ గమకింప
        కులిశపాతంబున గూలువారు


తే.

దుష్టజంతుతతుల్ పైకి దూఁకినపుడె
గుండె లవియఁగ నార్చుచు గుబులు గుబుల
కండలును నెత్తురుల్ నోట గ్రక్కువార
లైరి యీరీతి దనుజమాయాతిభీతి.

190


తే.

పఱచువారలుఁ దముగని పఱచువారు
నఱచువారలఁ గూడి వాచఱచువారు
సోలువారలపై దాము సోలువారు
వ్రాలువారలపై దాము వ్రాలువారు.

191


చ.

పొరిపొరి మాయచే దివిని బుట్టిన తద్రథసద్భటాశ్వకుం
జరములు శల్యఖడ్గవృకసైరిభముల్ కురురాజుసేనలం
గరచి బెనంగి డొక్కలును కంఠములుం బెకిలించి చించి దో
శ్శిరము లురంబులు నమిలి చిందఱవందఱఁ జేసి ధౌర్త్యతన్.

192


సీ.

బలితంపుపిడుగు పైఁబడ ఘీంకరింపుచు
        నిలమీఁద నొఱుగు గంధేభములును