పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/337

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

282

తాలాంకనందినీపరిణయము


నెఱిముఱిగా వచింప ధరణీవరకన్యలఁగూడి రేవతీ
తరుణియు వెంటరా నడిచెఁ దత్కురురాజు నెదుర్కొన న్మతిన్.

85


గీ.

సారణానిరుధ్ధసాంబోద్ధనాక్రూర
చారుదేష్ణముఖ్యు లీరసములు
మదిన దగి విలంబమందక పోరామి
వలన పెండ్లి జూడ వచ్చి రపుడు.

86


క.

హరి సాత్యకియుం దక్కఁగ
పురమున గల సకలయాదవులతోగూడన్
బురికొల్పి రౌహిణేయుఁడు
కురురాజుకుమారు నెదురుకొనఁగా నేఁగెన్.

87


చ.

అనఘుఁడు రేవతీరమణుఁ డంతిపురం బటు నిర్గమించి వా
ద్యనినదముల్ జెలంగఁ గలశాంబుధిఁ బొంగినయట్లు సంబరం
బున నృపపుంగవుల్ బుధులపూర్వహితుల్ దగ వారివారివా
హనముల నెక్కిరాఁ గదను హాటకదీప్తరథాధిరూఢుఁడై.

88


మ.

దివిటీల్ వెన్నెలపంతియల్ మెఱుపుబత్తీ ల్కాగడా లారతుల్
భువనద్యోతులు మంచుబుడ్లు బిరుసు ల్మోంబత్తు లొక్కొక్కచా
లు వెయిల్వెల్గ సుయోధనుం డెదురుకో ల్కూడంగ నేతెంచె బం
ధువితానంబులు విప్రసంఘములు దోడ్తో వెంట నేతేరఁగన్.

89


క.

యమునానదీప్రవాహం
బమర దీపూర మెనసినట్లు పరీవా
రము దాము నెదుర్కొను కురు
సముదయమున్ వాహనములసరగు నడిగియున్.

90


తే.

విరులు గంధవళ్లు విమలశుభాక్షత
లొకరికొకరుఁ జల్లుచుండునంతఁ