పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/334

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

279


గగనపరిచుంబితద్రుమాకలితగహన
వాటిపొడసూడ యబ్బురపాటుతోడ.

70


క.

బలభద్రతనయ యెదుటం
బలవిక్రమరుచిసమాజు పార్థతనూజుం
దిలకించి విస్మయము బా
టిలఁగ సుభద్రాసతిన్ హిడింబిని గనియెన్.

71


ఉ.

ఎక్కడిద్వారకాపురము, నెక్కడియీవిపినంబు కన్నుగూ
ర్కెక్కడ నిద్ర మేలుకొను టెక్కడ, దవ్వుననుండు మత్ప్రియుం
డెక్కడ, నేఁడు నేను గను టెక్కడ, మున్ను శుకంబుపల్కె న
మ్మక్క ముహూర్తవేళ నభిమన్యుని జూచెదవంచు నిక్కముల్.

72


గీ.

అనుచు దిగ్గునలేచి మేనత్తపాద
ములకు మొక్క ననుంగుకోడలిని దిగిచి
శిరము మూర్కొని కౌఁగిటఁ జేర్చుకొనుచు
హితవచోరూఢి నలయించి యిట్టు లనియె.

73


మ.

మును మాయన్న యనాదరోర్తులను నిర్మోహంబుచే వన్యభూ
మిని నే నీయభిమన్యుతోడఁ జనగా మీబావ మాబావకుం
దనయుండైన ఘటోత్కచుం డిచటి కాంతారాశ్రమంబందు నుం
డిన నన్సోదరు సోదరింపఁ బొడగంటి న్నిన్ను చంద్రాననా!

74


క.

అనుజునికొఱకై గాదే
నిను మాయానిద్ర బుచ్చినేఁ డిట దెచ్చెన్
వనితా నీ తలిదండ్రుల
గనియెద విక నేఁటినాలుగవనాటి కొగిన్.

75


చ.

అని శశిరేఖ సమ్మతిల నయ్యభిమన్యు నపాంగదృష్టిచే
గని యనురాగ మగ్గలముగా గనురెప్పల నప్పళించుచున్