పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/333

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

278

తాలాంకనందినీపరిణయము


గ్రామమున మద మణంచి మ
హామహిమ న్సతిని బెండ్లియాడుట యొప్పున్.

64


చ.

అనిన ఘటోత్కచుం డతని హస్తతలంబులు బట్టి పల్కె ని
ట్లన బనియేమి కౌరవులహుంకృతి మాన్పఁగ నేనొకండ జా
లును, నతఁ డాజి మద్బలము లోగొనలేఁ డదిగాక వారి గీ
టణపఁగ వల్దటంచు భవదంబనియామక మున్నదే గదా!

65


క.

ఇంతన నేటికి వారల
గంతులు వేయించి తికమక న్గడుపగ నే
డింతియెగాని తదీయుల
నంతము నొందింప దలఁప నది యట్లుండెన్.

66


తే.

నీవు మేనల్లుఁడవు, రౌహిణేయుమీదఁ
గత్తిగట్టుట న్యాయంబుగాదు తండ్రి,
పోయి కురురాజు నిరకటంబునను ద్రోయ
జాలుదునుగాని నీపైన మేలనయ్య.

67


క.

అదిగాక కాననంబున
ముదితలని, క్రూరసమరమున కిరువురమున్
గదియుట లధర్మమని నీ
మది నెఱుఁగవె రాజనీతిమర్మము లెల్లన్.

68


క.

అని యనుజు నూఱడించుచు
దనుబట్టిన కేలు విడిచి దనుజేంద్రుఁడు గ్ర
క్కున బొబ్బ లిడుచు చివ్వున
వినువీథికి నెగసె సురలు విస్మయమందన్.

69


గీ.

అపుడు శశిరేఖ దనుజమాయాసుషుప్తి
నెడలి కన్నులువిచ్చి నల్గడలుఁ జూచి