పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

269


మాట లికేటికి పాండవ
కోటికి సాటికిని మే మగుదుమే దలఁపన్.

22


చ.

బలీయులు కర్ణసౌబలులుఁ బల్కరె మీవలె నెన్నఁడైన దు
ర్బలవచనంబు లిట్లు యదువర్గము మాహితులైన పాండవా
వళి యననేమి యాత్రిపురవైరియు నేమి బిడౌజుఁ డేమి మ
త్కులిశగదాప్రఘాతమునకుం బొడరంగలరే కనుంగొనన్.

23


చ.

పలుమఱు లీనిషేధములు బల్కకు, డింతట మామనంబు రం
జిల కనకాభిషేకములు జేసినయట్లు భవత్ప్రియోక్తులం
జెలిమిని చెవ్వియొగ్గిన వచింపుడు పెండిలిమేలుఁ జూడకో
ర్కెలు గలవేని రండు యిది కీడని దోచిన రాకుఁ డింతటన్.

24


క.

పలుఁ బల్కు లనఁగ నేటికి
బలరాముం డొకఁడు మాకు పట్టైయున్నం
బలియులగు పాండవేయుల
దల నెత్తఁగనీక బాఱ దఱుమఁగలేమే.

25


క.

అని యుల్లసోక్తు లాడఁగ
విని భీష్మద్రోణు లవనివిభున కని రయో
జననాథ! కోప మేటికిఁ
గనియెదుగా కింక కార్యగతఫలసిద్ధిన్.[1]

26


ఉ.

కాలము దేశముం దెలియకన్ వచియించెడి వారినెల్ల మే
ల్మేలని మెచ్చె దీ విపుడు మీ రటు హాని దలంప నీమతిం
బేలరొ! పాండవోత్తము లహీను లటంచు దలంచె దించుకన్
తాలిమిలేక నీకు తలఁదాకిననాటి కెఱుంగ నయ్యెడిన్.

27
  1. ఈ పద్యము తరువాతనుండి ‘మును శుకరాజమున్— ’ అను పద్యము
    వరకు 'లి' లో పూర్తిగా లేవు. 'తా'లో అసమగ్రములుగా గలవు.