పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/322

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

పంచమాశ్వాసము

267


భేదమున నడలఁగా నట
మీఁదఁట నిరసింపజేయమే పాండవులన్.

12


క.

కావున నాలస్యం బిక
గావింపఁ బనేమి బంధుగణములనెల్లన్
రావించి పుర మలంకృతి
గావింతము తత్తదుచితకార్యానుగతిన్.

13


క.

అని దుశ్శాసనుఁ డన్నకు
వినయమునం దెల్ప నగరవీథుల నెల్లం
బనిబడి శృంగారింపఁగ
జనులకు విశదంబుగాగఁ జాటించుటయున్.

14


క.

వేడుకతోడుత నారా
ఱేఁడిగతిసాట తత్పురీజనులెల్లన్,
వాడల మేడల గోడల
తోడ నలంకృతులుఁ జేయఁ దొడగిరి ప్రీతిన్.

15


క.

సకలపదార్థము లెల్లను
శకటానడ్వాహకలభసముదయముల
క్ప్రకరముల కనచి గూఱిచె
నొకనిమిషములోన సముచితోత్సాహుండై.

16


క.

ధరణీసురులను సన్ముని
వరులను హితబాంధవప్రవరులను ధాత్రీ
వరులను హితవరులను నుతి
పరులను పిలిపించెఁ బ్రమదభావము మీఱన్.

17


సీ.

అపుడు భీష్మద్రోణు లది గనుంగొని సుయో
        ధన యీప్రయోజనం బనుచితంబు