పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/313

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

258

తాలాంకనందినీపరిణయము


క.

ఆలోపల కురుపతి యా
బాలామణి నాత్మసుతుని బరిణయమునకై
తాలాంకుని యడుగుటకు దు
రాలోచన జేసి బనిచె నవనీసురులన్.

322


ఉ.

అందుకు కన్య నిచ్చుటకునై హలి మి న్నఱచేత నొడ్డి న
బ్లెందున లేని మోదము వహించెను లగ్నము నేఁట రేపటం
బొందెను దానికై యదువిభుండును సాత్యకి గూడదంచు కా
ళిందివిభేదను న్మది జనింపఁగ జేయగలేక యుండినన్.

323


క.

నే యేమి కీ డెఱుంగక
మాయన్నగదా యటంచు మఱి నేవేడం
బోయిన నామదిలోఁ బగ
బాయని పరుషోక్తు లాఁడె పాండవులయెడన్.

324


క.

ధృతరాష్ట్రసుతుఁడు సముపా
ర్జితయశుఁ డతివైభవుం డజేయుం డత్యూ
ర్జితవిహితబంధుఁ డాతని
సుతునకు మత్కన్య నొసఁగ శుభముం గాదే.

325


క.

ధనవంతుఁడు కురుపతినిం
బొనఱ జయించెదరె పాండవులు గీండవులుం
గనుఁగొనఁగ వెన్నముద్దకు
మునుకోఱలు వచ్చి దూలములు గంకునొకో.

326


చ.

అతఁ డిలు వెళ్ళగొట్టఁగ మహాటవులం జరియించి కూటికిం
గతి జెడి యాలుబిడ్డలును గొనక వర్తిలువారితోడ నే
హితమతి వియ్యమంది సుఖియించుటకన్నను పెద్దనూతిలోఁ
జతికిలఁ ద్రోయ మేలని విషప్రచురోక్తులఁ బల్కెఁ బుత్రకా.

327


క.

అడవుల కారాకులు దిను
బడుగులు పాండవులతోటి బాంధవ్యము నీ