పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/302

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

247


ద్ధ్వాంతచరు నిశితబాణము
లింతింత న్శకలములగ నిరిచియు కినుకన్.

260


మ.

పటునారాచము వింటనెక్కిడి నభోభాగంబు గంపింప ది
క్తటముల్ మ్రోయ శిలోచ్చయంబుల ప్రతిధ్వానంబు గల్పింప నె
క్కట నాకర్ణతలాంతమంద గొని వీఁకన్ వ్రేయ హైడింబు హృ
త్పుటము న్నాటె మహేంద్రుఁ డద్రినిడుదంభోళిప్రభాభాసమై.

261


ఉ.

దానికి భీమనందనుఁడు దల్లడమంది మహాశనీసమం
బైన శరత్రయంబు విజయాత్మజు రొమ్మున నాటనేయ రో
షానలదీప్తుడై బదియు నైదుశరమ్ముల నొక్కపెట్టు సం
ధానముజేసి వ్రేయ నవి దాకె ఘటోత్కచు కీలుకీలునన్.

262


క.

అందున దానవుఁ డలిగి పు
రందరపౌత్రుని భుజాంతరాళంబున నం
దంద ఖరశరపరంపర
కొందల మందంగ నుడ్డు గుడువఁగ నేసెన్.

263


మ.

అపు డామార్గణజాలముల్ తృటిని మాయంజేసి సౌభద్రుఁ డ
స్రపబాహాయుగ ముగ్రబాణముల లక్ష్యం బుంచి హుంకించి దో
ర్నిపుణత్వంబు సెలంగ నవ్యవధిగా నిర్భీతి నేసెం ద్రివి
ష్టపసంచారులు మిట్టిపాటున నఖండధ్యానము ల్సేయగన్.

264


క.

ఈకరణి నొకరి కొకరు చి
కాకు పడ న్వేయు చండకాండప్రహతిం
బైకొన్న మేనిగాయఁపు
మూఁకలు జల్లెడను రంధ్రముల గతి నొప్పెన్.

265


ఉ.

ఈరసము ల్దొలంగక నహీనగతిం దము దాము బోరు త
ద్ఘోరశరానలార్చి గనుఁగ్రొన్న బగల్వలె నొప్పె రాత్రి యా