పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/278

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

223


బని పతితోడ బల్కియు రయంబున వారలఁ దోడితెం డనిం
బనిచెను నేటితోటి బలభద్రతనూజ సుభద్రకోడలౌ
ననెడు జనానులాపము వృథాయె నటంచు గృశింతు పుత్రకా.

128


తే.

సత్యకథనంబు మాని యౌద్ధత్య మూని
మనల దారిద్ర్యులని చూచి మదిని రోసి
కలిమిగల కౌరవుల మెచ్చె కన్య నిచ్చెఁ
బేదతన మిట్టిదియెగాన బృథ్విలోన.

129


శా.

చాపల్యాంకుర మార్తికారణము భాషావ్యత్యయప్రాప్తి దు .
ర్వ్యాపారాశ్రయ, మాప్తదూషితము, దైన్యాలాపజన్యంబు, హృ
త్తాపోపస్మృతి, బంధుసౌహృదవిఘాతంబైన దారిద్ర్య మి
ట్లాపాదించిన మిత్రులైన నెడసేయం బూను టాశ్చర్యమే.

130


క.

ఘనులగు పాండవు లిచ్చటి
కనుమానింపకను మనల నంపెడివేళన్
వనమునకు వారితో మన
మనుగమియించక వసించు టనుచితమయ్యెన్.

131


క.

చేటెఱుఁగని పనిజేసియు
మాటల పసియేమి దిక్కుమాలినగతి ని
చ్చోట వసింపఁగ నేటికి
నేటగు నాయాశలన్ని నేటికి దీరెన్.

132


క.

అని జనని దెలుప తనలో
దను గనలుచు సవ్యసాచితనయుఁడు రోషా
ననజనితఘనతరోచ్చ్వా
సనిరూఢసభీషణోగ్రసముదగ్రగతిన్.

134


తే.

దండతాడితమౌ మృగేంద్రమ్ము లీలఁ
బదహతంబైన గృష్ణసర్పంబు పగిది