పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/274

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

219


ఉ.

ఏసతి నేవరుండు వరియించ సృజించె విరించి హేతు వ
ట్లే సమకూరుగాక నితరేచ్ఛల దుర్మతు లెన్నియూహలుం
జేసిన నిష్పలం బగుట సిద్ధ మటంచు నెఱింగి యీవృథా
యాసము మీరు జెందు టికనైనను మీదట గాన నయ్యెడిన్.

106


క.

ఇత్తెఱఁగున సాత్యకి కఠి
నోత్తరములు కొన్ని బలుకుచుండగ సత్రా
జిత్తనయ రుక్మిణీమణు
లత్తఱి విని వినయ మెనయ నని రాతనితోన్.

107


మ.

అల సౌభద్రుఁడు మీకుఁ గృష్ణునకు మేనల్లుండొ? తాలాంకున
ర్మిలిమేనల్లుఁడు కాఁడొకో? నెనరులేమి న్మీర లీఖండితో
క్తులు బల్కం దమకేల కన్నియకు బాధ్యుల్ తల్లిదండ్రాదులుం
గలరుం గావున వారిసమ్మతము లింకం ద్రోయ నెవ్వండగున్.

108


చ.

అని యిటు లంద ఱన్నిగతు లాఁడుటకుం బలభద్రుఁ డించుకై
నను తడబాటులేక కురునాయకుఁ డంపిన విప్రయుగ్మముం
గనుఁగొని గంటిరే కమలనాభుఁడు సాత్యకియుం గురుక్షితీ
శునియెడ కిన్కయు న్నెనురు జొప్పడు పాండవపక్షవాక్యముల్.

109


ఉ.

వీరలు వెఱ్ఱులై పలుకువింతలు మీరుఁ దలంపనేల దు
ర్వారబలారివారమదవారణవారనివారణోరుకం
ఠీరవుఁడౌ సుయోధను గడిందిమగంటిమి నే నెఱుంగనే
మీర లతిత్వరం బ్రియము మీఱఁగ వీటికి నేఁగఁగా దగున్.

110


క.

సుముహూర్తవేళకును భూ
రమణుని వరయుక్తముగను రావింపుడు వే
గమె యనుచు రత్నభూషణ
విమలాంబరముల నొసంగి వీడ్కొల్పుటయున్.

111