పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

214

తాలాంకనందినీపరిణయము


ష్కారణభక్ష్యభోజ్యములు కై నెడద్రోయుచు చేదుకాయలం
గోరి భజించునట్టు లొనగూడదె పాండవబాంధవం బిలన్.

78


తే.

పూర్ణసామ్రాజ్యవిభవసంపూజ్యులైన
వారినెల్లను విడచి దుర్వారగహన
వన్యశైలాగ్రచరుల కిక్కన్య నొసఁగి
వియ్య మందంగ నూహించు వెఱ్ఱి గలఁడె.

79


క.

అనినం గృష్ణుఁడు తనలో
దను గనలుచుఁ బలికె పాండుతనయులయెడలం
గనికరములేక సుత నీ
కనుకూలుల కొసఁగి యూర్జితాప్తిం గనవే.

80


చ.

అది కనుగొందుఁ బాండుసుతు లాగ్రహులై చనుదెంచిరేని సం
పదల మెలంగు కౌరవులపాటు లెఱుంగగవచ్చు నీకు మే
లొదవఁగ నే వచించు వినయోక్తు లెఱుంగవుగాని దైవ మె
య్యది ఘటియించునో దెలియనౌనె మహాత్ములకైన నగ్రజా.

81


చ.

అని హేతుగర్భవచనము
లనుచు సహోదరిని జూచి యమ్మా యిక నీ
తనయునకు సుత నొసంగం
డని దెలియుము దైవయోగ మది యెటుఁగలదో!

82


మ.

అనుచుం దిగ్గున లేచి శౌరి జనఁగా నయ్యంబుజాతాక్షి స
య్యన తాలాంకునిమోము గన్గొనుచు నన్నా నీకు మేనల్లుఁ డౌ
ననిగాదా శశిరేఖ నిత్తునని యాథార్థ్యంబుగా బల్కె నె
మ్మన మాహ్లాదము మీర నిన్నిదినము ల్మాటాడకుంటిం గదే.

83


క.

నీమఱదు లడవి కేఁగిన
దీమొదలుగ వారిశ్రమ సహింపుచు నైనన్
నీమన్ననలకు మురిపెము
చే మనితిం గొడుకుపెండ్లి జేసెద వనుచున్.

84