పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/260

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

205


సీ.

సతినెఱు ల్నెమిలిపింఛమురీతిని జెలంగఁ .
        గాలాహిని జయింప ఘనత గాదు,
పడఁతిమో మిందుబింబమురీతిని జెలంగఁ
        దమ్ములనెడప చిత్రమ్ము గాదు,
సుదఁతికెంజిగిమోవి శుకతండమును బోల్పఁ
        బక్వబింబము నెంచ భరము గాదు,
కలికిపెందొడ లిభకరములవలె నొప్ప
        నికరంభలను గెల్చు టెచ్చు గాదు,


గీ.

చనులు జక్కవలబెడం గనుకరించ
తమ్మిమొగ్గల జిదుమ చిత్రమ్ము గాదు
తనువు బలుకప్పురఁపుఁదావి నెనసినపుడె
వివిధతాపంబు లార్పుట వింత గాదు.

30


ఉ.

ఎంతని నే నుతింతు తరళేక్షణ చక్కదనం బటుండ ని
మ్మంతటిలో భవత్సుతుఁ డహీనగుణాఢ్యుఁడు లక్ష్మణుండు న
య్యింతికి భర్తగాఁగ నొనరించితివేనియు నీకుఁ గోడలౌ
టింతియగాదు రాజ్యరమ కెంతయు భూషణమై జెలంగెడిన్.

31


క.

ఏమో తెల్పితినని మది
వేమరు సందేహసరణి వెదకకుమ యిదే
క్షేమంకరము నిజముగ
నామదిఁ దోఁచినది యిది యొనర్చుమి వేగన్.

32


క.

అని చెప్పి, సురమునీంద్రుడు
తనరాక నిరీక్ష సేయఁదగుచోటికి చ
య్యన నేఁగె కేశవధ్యా
ననిరూఢి ఘనంబుగా మనంబున బెనఁగన్.

33


క.

అంతట దుర్యోధనుఁ డ
త్యంతముదం బొదవ నాప్తులగువారల నే