పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

చతుర్థాశ్వాసము

203


గలకాల మించుకైనను
కలహంబునులేనిదినము గడపఁగ నేలా.

18


ఉ.

ఈశిరేఖచక్కఁదన మెల్లను విన్న సుయోధనుండు దా
నై శతధాకుమారునకు నంగన నిమ్మని యచ్యుతాగ్రునిం
డాసి వచింపఁగా నతఁ డొడంబడకుండునె యేతదర్ధమై
కేశవుఁ డెల్లభంగులను కేవలవిఘ్న మొనర్పకుండునే.

19


తే.

దాని కొకరీతి కలహమే తారసిల్లు
నల సుయోధనకార్య మట్లడుగుబట్టు
బడలి చిందఱవందఱై చెడుటవలన
నింక మోదంబె గాని నా కేమి చింత.

20


మ.

అని యూహించి విదర్భరాజసుత నెయ్యంబొప్ప వీడ్కొల్పఁగా
జని యాహస్తిపురీవరంబున సభాస్థానంబునం గొల్వుదీ
ర్చిన దుర్యోధనుఁ జేరబోవ నతఁ డర్థిన్ మ్రొక్క భద్రాసనం
బున నేమించి సుగంధమాల్యముల సంపూజ్యంబు గావించినన్.

21


క.

కురునాథ! కుశలమే మీ
గురుబంధుజనానుజాదికోటికిని, శుభం
కరమె నిజరాజ్యమును పరి
చరులు భవచ్ఛాసనంబు సలుపుదురు గదా!

22


చ.

అనిన నృపాలమౌళి దరహాసముఖంబున బల్కె దేవ మీ
ఘనకరుణారసంబున నఖండశుభోన్నతి గల్గు టెంత మీ
యనుగమనం బింకెచ్చటికినై యెటనుండియొ సాదరంబుగా
వినవలతున్ భవత్కృప సవిస్తరరీతిని దెల్పఁగాఁదగున్.

23


వ.

అనిన రాజేంద్రునకు మునీంద్రుం డిట్లనియె.

24


ఉ.

ద్వారకలో యదూద్వహుఁ డుదారయశోవిభవంబులన్ జగ
ద్భారకుఁడై హలాయుధుని బాయక కంసనృశంసముఖ్యసం