పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/255

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

200

తాలాంకనందినీపరిణయము


సీ. పటుసితాంభోజప్రభాభాసురత మేన
        పాటలచ్చటసటాపంక్తి వ్రేల
హస్తపద్మభ్రమాయాతబంభరడింభ
        జాలవన్నలినాక్షమాల దనర
గంగాద్యనేకాపగానీరపూరమౌ
        వలికేలి ఘనకమండలువు మెఱయ
స్వాంసభాగోపరిస్వరపూరమహతీని
        నాదంబు 'నారాయణా' యనంగ


తే.

తారహీరపటీరడిండీరసౌర
వారణక్షీరకర్పూరశారదాభ్ర
చారుతరశుభ్రదివ్యశరీరుఁడైన
నారదుఁడు తారసిలె నంత శౌరిచెంత.

6


క.

నిలిచిన మౌనీంద్రుని పద
జలజములకు సాగి మ్రొక్కి సద్వినయముగా
వలగొనుచును నిది మేలని
దలఁచి వినమ్రత నుతించెఁ దగుమధురోక్తిన్.

7


సీ.

ఫణినాథుఁడే మౌనిపాటకు ఫణులెత్తి
        యాలించు కర్ణరసాయనముగ,
మున్ను వేదవ్యాసముని యేమహాత్ముని
        భావంబు గని జేసె భాగవతము,
దక్షప్రజాధినేతకు నేమునీంద్రుని
        చే ప్రజాపాలనస్థితి లభించె,
ఘనుఁడు ప్రాచేతసుం డనఘరామాయణం
        బేతపోనిధియాజ్ఞచేత గూర్చె,


తే.

నతతమోక్షార్జనోపాయచతురతఁ దగి
విదితబ్రహ్మాదులను వశంవదులఁ జేయు