పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

195


యాశించి బిసబాహయని తూఁగకు మరాళ
        యీభామ ధారాధరాభవేణి


గీ.

గాన వచనాలకస్వరగమనములను
సాటివారలు మీరు మామాట వినక
యెగసిపోనేల ఝంకృతు లిడఁగనేల
యొరలఁగానేల బొరె డాగియుండనేల.

162


క.

అని బిత్తఱికత్తియ ల
మ్మనసిజశశిగంధవహసమాజమును ప్రియో
క్తిని దూరి రేవతీసుత
కనుకూలముగా వచించి రనుపమలీలన్.

163


సీ.

తనువు ఫాలాక్షనేత్రమహాగ్నిచే క్రుంగె
        తుంటలై చాపంబు మంటగలిసె
మకరధ్వజము తుంగమడుగులోన నణంగె
        శరములు పురినిచ్చి ధరణిగూలె
చెట్టుచెట్టున జేరి చెదఱెను నీమూఁక
        మొదటినుండి రథమ్ము మూలఁబడియె
చెలికాఁడు దెఁసఁజెడి జేరె కాఱడవులఁ
        బక్షియై తురగంబు బయలు బట్టె


తే.

నింక మరుఁ డేడ మన మేడ యితనివలన
తలఁపు నిలుపకు మమ్మ బెగ్గిలకు మమ్మ
నీమనోరథసిద్ధియై నెగడు నమ్మ
కొమ్మ వినవమ్మ యోముద్దుగుమ్మ లెమ్మ.

164


శా.

ఈరీతిన్ శిశిరోపచారముల నయ్యేణాక్షి మోహానలా
సారంబెల్ల నణంపుచు న్విహితవాక్చతుర్యమాధుర్యముల్
మీరం బ్రొద్దులుబుచ్చుముచ్చటల పేర్మిం దెల్ప నారాత్రి నిం
డారన్ యామచతుష్టయం బరిగె నుద్యచ్చంద్రికాపూర్ణమై.

165