పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/248

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

193


బ్రతికియుండుట విరహిణీప్రాణహాని
కోకకులజైత్ర కువలయినీకళత్ర.

155


చ.

నిను బెనుబాము మ్రింగ నిక నీనిలువెల్లను నీఱుగాను నీ
తనువు పదాఱుతుంటలయి దారుణకార్శ్యత నీఱు నీరుగా
దిన మొకచాయ గ్రుంక సుదతీమణులం గలగించు పాపమే
గునగునకాళ్ళవ్రేళ్ళ బెనఁగుం దొలిగింపవశంబె చంద్రమా!

156


క.

అని పలికి మదనునకు వెను
కొను మలయసమీరకేకికోకశుకపికా
ళినికాయములను గనుఁగొని
వనితామణు లనిరి రుచికవచనరచనలన్.

157


సీ.

ఒకమహాబిలమున నుద్భవించి గిరీంద్ర
        మార్గంబునను బయల్ నిర్గమించి
కాంతారభూము లంతంతన జరియించి
        కాఱుపూఁబొదరిండ్లు దూరి వెడలి
సతతప్రభంజనస్థితి జీవులకు జూపి
        దివము రాత్రిని సదాగతి వహించి
పాంథహృద్వేదనప్రకటగీతి గమించి
        నవ్యమహాబలోన్నతిని మించి


గీ.

భువిని సాక్షాత్కరించు బెబ్బులివి నీవు
సాధుబాధ లొనర్చు టాశ్చర్య మేమి
నిను జగత్ప్రాణుఁడని బిల్వ నీతియగునె
పాంథజనమారణోత్సాహ గంధవాహ.

158


క.

చలము గొని నిన్ను విషధర
ములు మెఁసఁగఁగ వానిలేశము న్వంచింపం