పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/240

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

తృతీయాశ్వాసము

185


గీ.

యనుచుఁ దమతమ కనుకూలమైనపనుల
నొకరినొక రుచ్చరింపుచు నోపినటుల
గూర్చి శశిరేఖతనుతాప మార్చుకొఱకు
సకలశిశిరోపచారము ల్సలిపి రపుడు.

131


చ.

సరసిజనేత్ర లింతి యుపశాంతికినై శిశిరోపచార మీ
కరణి యొనర్పఁగా సురభిగంధము పెట్టి పరాగమై ధరం
దొరిగె జిగుళ్లు క్రొవ్విరులు తుత్తుముఱయ్యె బిసంబులెల్ల భం
గురగతి వాడె మైనినికె గొజ్జఁగినీరు. మనోజవేదనన్.

132


క.

తోడిచెలు లెట్లొనర్చిన
నాడాడకు స్రుక్కువార లందరిలో బల్
నాడెమగు చేడి యొక్కతె
నాడి పరీక్షించి గుంభనంబున బలికెన్.

133


సీ.

అంతకంతకు తాప మధికమై చెలిమోహ
        ముడుగదే 'పూర్ణచంద్రోదయము'న
మఱిమఱి ప్రబలమై మది గలంచునుగదే
        యింతికి 'మదనకామేశ్వరము'న
మాటిమాటికిని యారాట మొందునుగదే
        రమణీమణికి 'వాతరాక్షసము'న
గడెగడె కింక వెక్కసము జెందునుగదే
        సతి 'నీలకంఠరసంబు'వలన


గీ.

దినదినం బెక్కువగుఁగాని తీరదే 'వ
సంతకుసుమాకరంబు'న సకియలార
'భూపచింతామణి'ని గాని పొలఁతి విరహ
దారుణజ్వరదోషంబు దీరదమ్మ.

134


సీ.

మరువక నిక నుగ్రమంత్రము ల్బఠియించి
        తనుహీనభూతమ్ము దరుమరమ్మ