పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/119

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

48 తాలాంకనందినీపరిణయము


స్వాంతమునం దలంపుచు హిమాద్రికి వేఁ జనియుం దదీయప
ర్యంతధరిత్రిసేననిడి యన్నియమించి యుదంచితంబుగాన్.

198


ఉ.

బంగరుకొండపట్టి తనపట్టపురాణిగ మేలుమేటి య
ర్ధాంగము భర్తనంటిన మహాసతి నిన్గనుభాగ్యశాలి యు
తుంగపవిప్రహారమున బొర్లనిబిడ్డనిగన్నతండ్రి చూ
డంగడుమానికంబుల కొటారము శీతనగంబు గాంచియున్.

199


ఆ.

అరయ సర్వమంగళావాసమై యొప్ప
హితవిభూతిచే నహీనకటక
రమ్యమగుచు నీధరాధరమ్మును గిరీ
శాఖ్య గనుట కేమి యబ్బురంబు.

200


సీ.

తత్ప్రదేశంబునదగు నగస్త్యవటంబు
    గాంచి యచ్చట నిర్గమించి వెడలి
రహి భృగుశృంగహిరణ్యతీర్థము గ్రుంకి
    నైమిశారణ్యమునకు గమించి
నారాయణస్వామి నారాధన మొనర్చి
    యాప్రయాగకు నేఁగి యటఁ ద్రివేణి
సంగమంబున గృతస్నానుఁడై మాధవుఁ
    బొగడి పంచక్రోశమునకు నేఁగి


తే.

కడలి మణికర్ణికను గ్రుంకి గయకు నరిగి
పొగడి శ్రీపురుషోత్తమంబునకు నడచి
శ్రీజగన్నాథశౌరి నీక్షించి కొలిచి
యాతలను గౌతమీనదీస్నాతుఁ డగుచు.

201


క.

చని చని యనిమిషనాథుని
తనయుండు సమస్తపుణ్యతటినీతతిమ
జ్ఞానదానవిధు లొనర్చుచుఁ
గనుఁగొని యాకృష్ణవేణికడకుం జనియెన్.

202