పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/116

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

45


తే.

దైవవశమున నొక్కభూదేవమౌళి
గోగణంబులఁ దస్కరుల్ గొని పలాయ
నంబు గొనిరంచుఁ దెల్పఁగా నరుఁడు సాధు
రక్షణైకాభిరతి సత్వరమున లేచి.

179


క.

వడి వెంటనడచి తస్కరు
లడుగంట నడంచి తెత్తునని ధర్మజు మే
ల్పడకింటనుండు ధనువున్
కడగంటం గని బిరాన గైకొని జనియెన్.

180


ఉ.

దొంగల నంగలోఁ గలసి దోర్బలశక్తి కరివ్రజంబులో
సింగముభంగిఁ దూకి పటుశింజిని మ్రోయ గడంగి విక్రమా
భంగురసంగతిన్ విశిఖపంక్తుల వారలఁగూల్చి గోగణం
బుం గొని నిస్సహాయజయభూరియశోన్నతిఁ దెచ్చెఁ జెచ్చెఱన్.

181


క.

తెచ్చినగోగణములఁ దా
నిచ్చిన భూసురవరేణ్యుఁ దెచ్చిన ప్రేమన్
మెచ్చి నయోక్తుల దీవన
లిచ్చి నిజాలయమునకు సుఖేచ్చం జనియెన్.

182


గీ.

ఇంటి కేతెంచి యర్జునుం డొంటిఁ దలఁచె
వింటికై యగ్రజుని పడకింటఁ జొచ్చి
యుంటి నిటువంటి కాలుష్య మంటకుండ
పంటవాల్గంటి వలఁగొంట గెంటు ననుచు.

183


క.

మతి కేను భూప్రదక్షిణ
గతికే నిశ్చయము సేయఁగా ద్వారవతీ
స్థితి కేఁగుటయు సుభద్రా
సతికేళికి నిదియ యుక్తసమయం బనుచున్.

184


ఉ.

అన్నకు మ్రొక్కి నీదుశయనాలయ ముద్దతిఁ జొచ్చి మచ్చుపై
నున్న శరాసనంబు గొని యొక్క ధరామరగోగణాపహున్