పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/111

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

40

తాలంకనందినీపరిణయము


ల్చనుఁగవ పొంకము న్నడుముసన్నదనం బలబోఁటిసాటియౌ
వనితల మూఁడులోకములవారి నెగాదిగఁ జూడఁ గానమే.

154


క.

ఆకాంతాతిలకంబున
కే కవ్వడిచే జనించు హితుఁ డభిమన్యుం
డాకామపాలనందని
గైకొన్న కథాక్రమంబు కడబడ వినవే.

155


వ.

కావున నిట్లఖిలజగద్వల్లభుండగు రమావల్లభుండు నందవ్రజసుందరీసందోహనయనారవిందానందకందళత్సుందరతామందిరుండును, అనర్ఘ్యమణిగణకిరణస్ఫురణదేదీప్యమానహారకేయూరకటక శ్రీవత్సకౌస్తుభవైజయంతీవనమాలికాకుండలగ్రైవేయప్రముఖదివ్యభూషణుండును, సహస్రకోటిభాస్కరనిరాఘాటసుషమావిడంబితరథాంగశంఖాసిగదాధనుర్ధరణచతుర్భుజవిరాజితుండును, నిఖిలజగత్పూజితుండును, సమస్తవస్తుజాతాస్తోకవితరణప్రశస్తనిరస్తస్వస్తరుస్తోముండును, యదువృష్ణిభోజాంధకకులార్ణవరాకాసుధాకరుండును, షడ్గుణైజైశ్వర్యసంపన్నుండును, దేవకీజఠరశుక్తిముక్తాఫలుండును, షోడశసహస్రరాజకన్యాపరివృతుండును, అష్టమహిషీసేవితుండునునై యుండె. వెండియు—

156


తే.

అఖిలలోకాధినాథుఁడై యలరు శౌరి
నందనందనుఁ డగుచు నేడించు మధుర
శూరసేనాదిదేశముల్ భూరిమహిమఁ
బూని పాలించె నుగ్రసేనానుమతిని.

157


తే.

పుండరీకాక్షుఁ డఖిలబ్రహ్మాండనాథుఁ
డొండులేనట్టి హిమ నఖండవైభ
వుం డగుచు నుండువార్త నీరెండుచెవుల
నిండ వింటివి దీని నటుండనిమ్ము.

158


క.

అశాంతవిశదకీర్తి సు
రేశబిలేశయకులేశు లెన్నఁగ నతిసం