పుట:TALANKA-NANDINI-PARINAYAMU.pdf/106

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ప్రథమాశ్వాసము

35


తే.

మొలకవలె సౌకుమార్యమై మొగ్గరీతి
వృత్తమై, పుష్పముంబలె వికచమై, శ
లాటువలె నీటుగల్లి, ఫలంబు గలిగి,
మధురమై తేనెవలె మధుమధనుఁ డలరె.

133


సీ.

పరగ నందునితపఃఫలపు ముద్దులపట్టి
        వల్లవీపల్లవభల్లమూర్తి
గోపికానికరానుకూల కులస్వామి
        హితబంధుజనముల కింటివేల్పు
చాణూరముష్టికప్రాణాశనీఘాత
        కంసవిధ్వంసనకాలమృత్యు
వఖిలమౌనీంద్రసదానందతత్వంబు
        తతఖలప్రతతి కుద్ధండదండి


గీ.

పావనేతరమూఢమనోవికలుఁడు
నరుల కద్భుతసుఖజీవనప్రదాయి
యగుచు లీలామనుష్యవేషగతుఁ డయ్యె
కుటిలసంహర్త సాక్షాద్వికుంఠభర్త.

134


సీ.

మనుజులు పురుషోత్తమఖ్యాతిఁ దీపింప
        సతులు శ్రీకాంతసంగతిఁ జెలంగ
నిభరాజములు కుంభినీశస్థితిని గోర
        హయములు హరిసమాఖ్యత వహింప
రథములు పీతాంబరస్ఫూర్తిఁ జెలువొంద
        సరసులు చక్రభృత్సరణిఁ దనర
సుమలతావలి మధుసూదనస్థితి నొప్ప
        వనతతుల్ మాధవవ్యాప్తి నెసఁగ


తే.

సర్వమును విష్ణుమయ మను సరణిఁ దెలియ
జనుల నవికుంఠతాభోగఘనతఁ దేల్చి