పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/416

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

3ూg_ స్వీ య చ రి وذكة رقي బెదరించినట్లు సుబ్బరావే నాతో చెప్పెను. సుబ్పరావు స్వయముగా తానే జూవచేసి రాత్రియుఁబగలును నాకుఁ దెచ్చియిచ్చుచుండెను. భౌషధ సేవచేత "నా విరేచనములు కొంతతగ్గగా నేను పదు నేనుదినములకు థెంగుళూరికిఁ బోవుదుననఁగా మరల నొకపూట యన్నము తినుటకారంభించితిని. ఇది 91 వ సంవత్సరము మార్చి నెల మధ్యభాగము. విరేచనములు వెళ్లుట చేత బలహీనపడినను మంచమెక్కక తిరుగుచునేయుండుటచేత వితంతుశరణాలయ మునకుఁబోయి ప్రతిదినమును వారికి భోజనపదార్థములను పరిచియిచ్చి మంచి మాటలతో వారిని బ్రోత్సాహ పఱుచుచుండుటకును కట్టఁబడుచుండిన పాఠ శాలాభవనమువద్దకు బండిలాrశీ ప్రతిదినమునుపోయి యుదయసాయంకాలముల యందు పని విచారించి వచ్చుచుండుటకును మానినవాఁడను గాను, ఈ ప్ర కారముగాఁ గష్టపడుచుండిన కాలములో నావద్ద స్థిరముగానుండి నాకుపచారము చేయఁగలవారి నెవ్వరినైనను సంపాదించుకొనుట యత్యావశ్య కమనియు, తడవుగా సుబ్బరావువద్దనుండుట సముచితము కాదనియు భావించి, వివాహముచేసికొని వితంతు శరణాలయములాశని వారెవ్వరైన యావజ్జీవమును నావద్దనుండి నా సంరక్షణను చేసెడు పకమున నట్టివారికి వేయి రూపాయల నిచ్చెదనని చెప్పితిని. ఆప్పడందుండిన వారిలో దుడ్డమ్లయు, మంగమ్లయు, వేంకట సుబ్బమ్లయు నాక్షస వంటచేసి పెట్టి నా సంరక్షణము చేసెదమని ముందుకువచ్చిరి. వీరిలో వేంకటసుబ్బమ్ల తానువివాహమే చేసికోనని చెప్పెను; దుర్ణువు తాను కులములా’నుండు వానినే వివాహము చేసికొనెదననెను ; మంగవు తానిక్కడనుండ నొప్పకొన్నవానినే బ్రహ్మసమాజ వివాహవిధుల ననుసరించి వివాహముచేసికొని యావజ్జీవమును "నాకు సంరకణము చేయు చుండుదునని చెప్పెను. ఆమె హృదయమును పరీక్షించుటకయి నా కప్ప బొక యవకాశము సహితవు తటస్థించెను. వయస్సున పెద్దవాడుకాక మంచిస్థితియందున్న విధురుఁడొక్కఁడు తాను నియోగివితంతువును వివాహము చేసికొనెదనని బరంపురమునుండి నాతో ను త్తర ప్రత్యుత్తరములను జరపు చుండెను. శరణాలయమునందున్నవారిలో మంగవుయొక్క తెయే నియోగి