నా లు గ వ ప్ర) క ర ణ ము 32 Fー యమునందుఁ గల దృఢవిశ్వాసమే నాభార్యను పరోపకార కార్యములందు పరమసంతోషముతో పాటుపడునట్లు చేసినది. నాభార్య నిజమైన యీశ్వరభక్తురాలు; ఆమెకుఁగల యీశ్వరభక్తి యవ్యాజమైనది. ఈశ్వరునియందుఁగల నిశ్చలభ క్తిచేతనే యూ"వెు సమస్తకష్ట ములను సంతో పపూర్వకముగా సహింపఁగలుగుచు వచ్చెను. శ్రీ పునర్వివాహ సంబంధమున పావురజనులు బహువిధముల బాధించినప్పడును పంటలవారు మొదలయన పరిజను లాక్కసారిగా మమ్మ విడిచిపోయినప్పడును గోదావరికి పోయి యచ్చటి యల్పులా డెడి యవమానవాక్యములకు కోపింపక స్వయముగా నీళ్లు మోచుకొని వచ్చుట మొదలైన పనులను నిశ్చింతతోను నిత్యసంతోషము తోను నిర్విహింపఁ గలుగుట యీశ్వరభ_చేతఁ గాక మఱి దేనిచేత సాధ్య మగును ? ఆమెకు విగ్రహారాధన మందలి విశ్వాసము చిరకాలము క్రిందటనే పోయినది. ఆమె చుట్టుపట్లనుండెడు శ్రీలను వారమున కొకసారి మధ్యా హ్నము మాయింట గుమికూర్చి యే కేశ్వరోపాసనమునకు పురికొల్పి శ్రీ ప్రార్ధన సవూజమును స్థాపించుటయు, పరిశుద్ధాస్తిక భౌవమును ప్రోత్సాహ పఱుచు కీర్తనలను రచియించి వానిని తమ సమాజమునందు ప్రతివారమును పాడుచుండుటయు ఆమెకు కలిగియుండిన యే కేశ్వరవిశ్వాసమును సహస్ర ముఖముల ఫూ*ప్పించుచున్నవి. శ్రీలకు ప్రత్యేక ప్రార్థన సమాజమును ప్రత్యేక ప్రార్థనామందిరమును ఈపట్టణమునందు తప్ప వున దెన్నపురి రాజధానిలో మఱియొక్కడను లేవు. ప్రార్ధనసమాజమునకు తనతోడఁగూడ వితంతుశరణాల యములాగని వారిని కొందఱిని వెంటఁబెట్టుకొని ప్రతిశనివారమును తప్పక పోయి పార్థనలు జరపు చుండుటయు ప్రతిదినము ప్రాతస్సాయంకాలముల యందు వితంతుశరణాలయములాశని వారితోఁ గలిసి యానందాశ్రమములో ప్రార్థనను జరపుచుండుటయు మాత్రమేకాక ప్రతిదినమును రాత్రి で5°3 శయనింపఁబోవునప్పడును తెల్లవాఱుజామున నిద్రనుండి లేచి పనికిపోవుటకు ముందును తప్పక యే కాంత ప్రార్థనను జేసికొనుచుండెడిది. ఆమె యీప్రార్ధన సమాజసంబంధమున పతిసంవత్సరమును సంవత్సగోత్సవమును జరపి చందాల