పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/320

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

.oF「ご స్వీయ చ రి త్ర ము "కారిణీ సమాజమున కివ్రుని క్రొrfరcగా వారు సంతో" పపూర్వకముగా పాఠశా లను మాకిచ్చుట కంగీకరించిబల్ల లు దేశ పటములు మొదలయిన సమస్త సామగ్రి తోను 1907-వ సంవత్సరము సెప్టెంబరు నెలలో దానిని వూయధీనముచేసిరి పాఠశాల వూయధీనము కాఁగానే యావరకుచితముగా పనిచేయుచుండిన లక్షీ రక్కడ పనిచేయుటవూని వేసిరి. తక్కిన మూఁడుమాసములకు ననఁగో יד389ל సంవత్సరాంతమువఅకును పాఠశాలావ్యయములకయి మున్నూఱు రూపాయలు మాచేతి వియ్యవలసివచ్చినను, లక్షీనరసింహముగారు మాకిచ్చిన యుపకరణ ముల వెలయంతకంటె సెక్కువగానేయుండును. ఇక దీని నున్నత పాఠశాల నుగా మార్పవలెను. పాఠశాల క్రొత్త కార్య నిర్వాహకత్వమునకు వచ్చుటచేత పాఠశాలనున్నది యున్నట్లుంచుటకే పూర్వాంగీ కారము పనికి రాక విద్యాశాఖ వారివలన నూతనాంగీకారమును బడయవలసివచ్చెను. నాకు చెన్నపట్టణములోఁ బూర్వపరిచితులును ఉత్తర మండలముల పాఠశాలా పరీకకులును అయిన యేట్సుడొరగారి సాహాయ్యమువలన విద్యావిచారణాధికారి నూ పాఠశాల నంగీకరించెను. దానినున్నత పాఠశాలను గాఁజేయు విషయమునఁ గృషిచేయ నారంభించితిని. ఈవిషయమయి పాఠశాలా పరీక్సకులయిన యేట్సు దొరగారి తోను, రాజకీయ కళాశాలాధ్యతలగు హంటరు దొరగారితోను, మాటాడి రాజమహేంద్రవరములో నింకొక యున్నత పాఠశాలను స్థాపించుట కావశ్యక మున్నదని వారిని సహేతుకముగాఁ జెప్పి యొప్పించితిని. సాఠశాలామందిర వును గ ట్టించుటకయి యించుమించు"గా రెండువేల రూపాయలకొకయింటిని, చెరువు సోమయాజులుగారివద్ద కోట సమినాపమునఁ గొనుటయే కాక దాని చుట్టుపట్లనిగిడ్లను గొనుటకుఁగూడ చేరవూడుచుంటిని. మాపట్టణములోనున్నత పాఠశాలలు "రెండుండెను ; ఒకటి క్రైస్తవమతాచార్యులది, ఫ్రెండవది దొర తనమువారిది. మొదటి దంత యభివృద్ధిలో లేదు"గాని రెండవదియంున రాజ కీయ బోధనాభ్యసన పాఠశాల మిక్కిలి మంచి దశయందుండినది. ప్రతిపక పాఠశాలయొకటి బైలుదేఱ నున్నప్పడు నునుపున్న పాఠశాలవారికి భయము ను మాత్సర్యమును గలుగుట యస్వాభావికము కాదుగదా ? ఆందుచేత బోధ