పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/272

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

அ8s స్వి య చ రి త, ము డీతోఁట వితంతుశరణాలయము కట్టుట కనుకూలముగా నుండునని యాయన ਾS` (బ్రస్తావించెను. పట్టణములోని ప్రాతయింటిని గొనఁ బ్రయత్నించుట కంశెు నిటువంటితోఁటను సంపాదించి యందు వితంతుశరణాలయాదులు కట్టిం చుటయే యుక్తమని నాకును దోఁచెను. ఆతోఁట నాకు క్రొత్తదికాదు. Hධි నామ్చితులైన చల్లపల్లి రంగయ్యపంతులు గారిది. ఆయన యిప్పడు ప్రాడ్వివాక పదమునుండి యుపకారవేతనమును బొందివచ్చి స్వస్థలమయిన రాజమహేంద్రవరమును జేరియన్నారు. ఆయన తమ్ముడును -నా సహపాఠి యు విథవావివాహప్రయత్నములా నన్నుఁ బురికొల్పినవాఁడును ఆయిన చల్ల పల్లిబాపయ్యపంతులు గారును నేనును గలిసి యీతోఁటకుఁ బలుమాఱు వచ్చు చుండెడివారము. రంగయ్యపంతులు గారు ధనవంతులగుటచేత తోఁట నమ్మ కోవలసిన యావశ్యకము వారికుండదు గనుక నాకది దొరకుట దుర్లభముగాఁ గనఁబడెను. అయినను బ్రయత్నించి చూతముని తలఁచి రంగయ్యపంతులు గారి యింటికిఁబోయి నేను వచ్చిన కార్యమును జెప్పి వితంతు శరణాలయ నిర్మాణార్థ ముగా తోఁట నాకిండనియడిగితిని. అన్నదమ్ముల భాగములు తెగక తోఁట యోుకసారి యమ్లఁదలఁచినట్టును మూఁడువేల రూపాయల కెవ్వరోయడిగినట్టను చెప్పి సత్కార్యముకొఱకు నేనడుగుచున్నాను గనుక నాకు రెండు వేల యే నూఱురూపాయలకే యిచ్చెదమని నారు చెప్పిరి. నేను వెంటనే యేనూeు రూపాయలను గొనిపోయి యాయనకిచ్చి యాయనచేతను తమ్మని కొమాళ్ల చేతను తోటను నాకు రెండువేల యేనూఆు రూపాయలకు విక్రయింప నిర్ణ యించి క్రయధనములో -నేనూఱురూపాయలు ముందుగాఁ బుచ్చుకొన్నట్టు వ్రాయించి పుచ్చుకొంటిని. ఆరృత్తునట్టు కంపెనీలాr-నావి రెండువేలరూపావు లుండెను. పోలవరము జమివాదారుగారిచ్చిన రూపాయలు మొదలగునవి చెన్న పట్టణములోని వితంతు శరణాలయమునకును వీవాహములకును ఆయిన వ్యయ ములకే చాలకపోయినను నేను దానిని ముట్టుకొనక యావ్యయముల నన్నిటిని "ఫౌనే భరించి వితంతు శరణాలయమునకు నిధి యేర్పఱుపవలెనన్న యుద్దేశ ము తో పోలవరము జవిూదారుగారిచ్చిన వేయిరూపాయలును కోలాచలము వెం