పుట:Sweeyacharitramu Kandukuri VeeresalINGAM 1915 450 P Sarada Niketanam Guntur.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

Ο Ο Ε. స్వీయ చ రి త్ర ము నమివేసి యూ సామ్లతో రాజమహేంద్రవరమునకు వచ్చితిని. তেম্প7্যেe"ন సుబ్బారావు పంతులుగారి కియ్యవలసిన యసలు మొత్తము రు. 1500 లను, అప్పటి కయిన వడ్డి యించు మించు"గా నిన్నూఱురూపాయలను, కనప 3 శ్రీరాములు గారిచేతి కిచ్చి పంతుల వారికిఁ బంపితిని. ఆ వఱకెప్పడును నా వద్ద వడ్డిని పుచ్చుకొనకుండుటనుబట్టి వడ్డిని పుచ్చుకొనుటకు మొదట సంశ యించి తుదకుఁగైకొని వారా మొత్తములోనుండి నా సంపుటముల క్రయము క్రింద నిరువది రూపాయలను చెల్లు పెట్టి הסדe పత్రములను "నాకు బంపిరి. కాల మెప్పడును నేకరీతిగా నుండదు. కాలమహిమచేత బాహ్య పడా స్థములలోని మార్పుల మాట యటుండఁగా నంతరంగములు సహిత మత్యంత కఠి నము లయినవి క్రమక్రమము గామృదువు లగును, డీర్థ వైరములును ప్రణయ ములుగా మాఱును. సుబ్బారావు పంతులు గారును నేనును కొంతకాలను పరస్పర సంభాషణము లేనివార మయియుండినను చెన్నపురిలోసర్వకలాశాలా సభ్యుల సభ జరుగుచున్నప్పడు పంతులు గారే నేను కూరుచున్నచోటికి వచ్చి నన్ను పలుకరించి యాదర పూర్వకముగా నా యోగ క్షేమములను వి వారించిరి; నేనును సంతోషపూర్వకముగా వారి యూరోగ్య సౌఖ్యము లడిగి తెలిసి s^”oტჭ:). ఆటుతరువాత 53° యిరువురమైత్రియు క్రమక్రమముగా వృద్ధినొంది మరల పూర్వరీతికివచ్చెను. రాజమహేంద్రవరము వచ్చినతరువాత కూడచారు రెండు మూడు పర్యాయములు మాతోఁటకువచ్చి నన్ను చూచిరి. వారి హేందూ సమాజము యొక్క యొక సభాదినమునందు నన్నాహ్వానముచేసి వీధిలోని కెదురుగా వచ్చి లాగోపలికిఁ దీసికొనిపోయి యి- దినమున మన సభ €~g ప్రసిద్ధపురుషులు వచ్చినారని సభ వారితోఁబలికి గౌరవముచేసి నన్ను వీడు కొల్పిరి. ఈహిందూ సభయొప్ప డేలవచ్చిన దని తెలియనివా రడుx వచ్చును. పంతులు వారికి నామినాఁద కోపమువచ్చిన కాలములో నప్పటి సంఘ సంస్కరణ సమాజమునకుఁ బ్రతిపక్షముగా హిందూసమాజమును స్థాపించి, హైందవాభివృద్ధి (Indian Progress) co Fro's So’s పత్రికను ప్రారంభించిరి . సంఘసంస్కార కార్యములయందు చిరకాలపు పనిచేసినవారి