పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/387

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

374

స్వీయ చరిత్రము.



పుస్తకమును మరల నిచ్చివేసెను. ఆయన కాలవిలంబమున కోర్వకయావఱకున్న యాచారమునుబట్టి తమకు తోఁచిన నిర్ధారణములను వ్రాసిపోయిరే కాని యట్లు చేయుటలో వారికి లాభమేదియులేదు. సభ్యులలో ననేకులు దొరగారి యభిప్రాయ మేదో మాయభిప్రాయమదేయని తలయూఁచువారే కాని తమ స్వతంత్రతను చూపువారు కాకుండిరి. సభ్యులే యాలోచించి తమ స్వతంత్రాభిప్రాయము నిచ్చు వారయిరేని, అధికారులు వారిసాయమును సంతోష పూర్వకముగా పొందుచుండెడివారే. స్వతంత్రించి నిర్భయముగా నధికారుల యభిప్రాయమునకు వ్యతిరేకముగా తమ యభిప్రాయమును తెలుపలేని లోపము మనవారియందే విశేషముగానున్నది. దీనికి నిదర్శనముగా నొక్క సంగతిని చూపెదను.

నాదేహ మస్వస్థముగా నున్నందున రాజమహేంద్రవరములోనే జరగిన యొక తాలూకా సంఘ (Taluq Board) సభకు నేను పోలేక పోయితిని. సభ ముగిసినతరువాత కొందఱు సభ్యులు నన్ను చూడవచ్చిరి. ఏమేమి విశేషములు జరగినవని నేనడిగినమీఁదట వారిలోని విద్యాధికులే యొకరు దొరగారు మమ్మడిగి మాయభిప్రాయములను గైకొన్నారా యేమేమి నిర్ధారణములుచేసిరో మాకు తెలియనిచ్చి రా యని నాకుత్తరమిచ్చెను. అట్లు జరగనిచ్చుట మీదేతప్పిదమనిపలికి నేనూరకుంటిని. ఆపయినెలలో జరగిన సభలో వారు మొఱ్ఱపెట్టిన మోబర్లీ దొరగారె యగ్రాసనాసీనులయియుండిరి. ఒక విషయమున దొరగారికిని నాకును నభిప్రాయభేదము కలిగి కొంత వివాదము నడచెను. దొరగారు తమ యభిప్రాయమును సభ్యులకు తెలుఁగులో వివరించి తెలుపవలసినదని సభలోనున్న తహశ్శీలుదార్లతో చెప్పిరి. వారట్లుచేసిన పిమ్మట దొరగారి యభిప్రాయముపైఁ గల యాక్షేపణలను తెలుఁగులో నేను సభ్యులకు తెలిపితిని. దొరగారు నేను చెప్పినదాని కుత్తరముచెప్పిరి; దానికి నేను ప్రత్యుత్తరముచెప్పితిని. ఈప్రకారముగా కొన్ని నిమిషములు నడచిన తరువాత దొరగారు తమపట్టునువిడిచి నాయభిప్రాయ ప్రకారముగానే నిర్ధార