పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/380

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

367



కొందఱాతనికి వెఱచి యూరకుండిరి. ఆయింటి సమీపముననే వాసము చేయువారును పారిశుద్ధ్య సంఘములో సభ్యులునయిన నాళము కామరాజు గా రాయాక్రమణమును నాకుఁ జూపఁగా నే నా యాక్రమణమును తీసివేయించుటకయి జ్ఞాపిక పెట్టితిని. మాపట్టణములోని యొక గృహస్థుఁ డాయాక్రమణమును తీసివేయింపవలదని సభ్యులతో ననేకులతో చెప్పినందున వారాక్రమణమే జరగలేదని చెప్పఁదొడఁగిరి. ఈవిషయ మొక నాఁటి ప్రాతఃకాలమున జరగిన సభలో విచారణకు వచ్చెను. నే నాదినమున సభకు కొంచె మాలస్యముగాపోవుట తటస్థించెను. నాఁడధ్యక్షప్రతినిధి (Vice President) సభకు రానందున సభ్యులలో నొక్కరైన మెట్కాపుదొర (శాస్త్రపాఠశాలా ప్రధానోపాధ్యాయులు) గా రగ్రాసీనత్వమును వహించిరి. నేను సభకుపోవునప్పటికీవిషయమే విచారింపఁబడి నిర్ధారణమునకు సిద్ధముగానుండెను. నేను పోవుచునే యప్పుడు చర్చింపఁబడుచున్న విషయమేమని యడుగఁగా, పండామామయ్య యరుగువిషయమనియు సభ్యులలో నధిక సంఖ్యాకులాక్రమణము లేదనుచున్నారనియు దొరగారుచెప్పిరి. నేను లేచి 'యీసభ్యులలో నాక్రమణము లేదన్న వారెవ్వరు?' అని బిగ్గరగా నడిగితిని. సభ్యు లెవ్వరును మాటాడక మూకీభావమును వహించిరి. "ఇది యాక్రమణమయినందుకు సదేహము లేదు. నేను స్పష్టముగా నెఱుఁగుదును. మీరేమిచెప్పెదరు?" అని ఆవఱకా క్రమణము లేదన్న వారి నడిగితిని. వారిలో కొందఱాక్రమణమున్న యెడల తీసివేయింపవచ్చుననిరి; కొందఱేమియు పలుకక మౌనముద్రధరించిరి. అంతట నరుగులు తీయించివేయవలసినదన్న నిర్ధారణమును వ్రాసి చదివి, నీతి లేక యన్యాయపక్షము వహించెడు సభ్యులను గర్హించుచు మెట్కాపుగారు మాటాడిరి; ఆక్రమణమున్నట్టాయన యావఱకే నిశ్చయముగా నెఱుఁగును. వితంతు వివాహాది విషయములలో కొందఱు నాతో నేకీభవింపకపోయినను, లంచములు పుచ్చుకోక న్యాయపక్షావలంబులయిన సభ్యులందఱును నన్ను నాయకునిగా నంగీకరించిరి. ఆక్రమణము తీసివేయవలసినదని నిర్ధారణము జర