358
స్వీయ చరిత్రము.
గారు పంచియిచ్చినను పంచి యియ్యనేలేదనియు, గోదావరివఱదవలన తనయింటి భాగమునకు నష్టము కలుగుటయు వెంకయ్య తన భాగమును వృద్ధి చేసికొనుటయు చూచి కోదండరామయ్య గారిల్లు క్రొత్తగా పంచిపెట్టుఁడని కోరెనేకాని యిల్లు పంచియియ్యలేదనుట వాస్తవము కాదని కార్యనిర్వాహక సంఘమువారు నిర్ధారణము చేసినపిమ్మట తన వ్యవహారమును సామాన్య సంఘమువారి ముందు పెట్టవలసినదని దూషణోక్తులతో నుత్తరము వ్రాసియు, సామాన్య సంఘమువారు కార్యనిర్వాహక సంఘమువారి తీర్పునే స్థిరపఱిచిన తరువాత న్యాయసభలకుఁ బోయెదనని బెదరించియు, తాను బదులు పుచ్చుకొన్న సొమ్ము తీర్పనక్కఱలేదని కారణము చెప్పకయే తగవు పెట్టియు, తనకు ధనమియ్యక పోయినయెడల పునర్వివాహ పక్షమును విడిచి ప్రాయశ్చిత్తముచేయించు కొనెదనని భయపెట్టియు, ఉన్న సమాజమునకు విరోధముగా నత్యల్పకాలములోనే నశించిన యింకొకసమాజమును స్థాపించియు, తనకు ధనసాహాయ్యము చేయనివారిని తన పక్షమున మాటాడని వారిని దూషించుటకయి వార్తాపత్రిక నొకదానిని బైలుదేఱఁదీసియు, కోదండరామయ్య గారును, ప్రతిపక్షుల ప్రేరణముచేత నల్పాంశములనుబట్టి మఱియొకరిద్దఱును అ విచారమూలకములయిన తొందరపనులుచేసి నాకును సమాజమువారికిని కొంత శ్రమ కలుగఁజేయుచు వచ్చిరికాని యట్టివానినెల్ల నిచ్చట వివరించుట యనావశ్యకము. అంతేకాక యవి సువిచారపూర్వకములుకాని బాలవిచేష్టితములగుటచే నుపేక్ష్యములును క్షంతవ్యములునయియున్నవి. కొందఱు ధనాశ చేతనే లబ్ధమనోరథులుకాక యిట్టి తొందరలను చూపుచువచ్చిరి. అట్టివారు తామే స్వార్థపరిత్యాగులయిన పరార్థపరులయినట్టు నటించుచు తామడిగినంత యియ్యకపోవుటచేత తమ నిమిత్తమయి చందాలిచ్చి పాటుపడుచుండిన పుణ్యపురుషులను సహానుభూతిలేనివారని నిందింపఁ దొడఁగిరి. ఇక్కడి యీవితంతువివాహ సమాజములో రాజమహేంద్రవరములో ప్రముఖులుగా నుండినవారు ముక్కాలు మువ్వీసము చేరియుండిరి. ఈయైదు సంవత్సరము