పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/352

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

339



at a special meeting of the managing committee.(వితంతువివాహ సమాజమని పైడా రామకృష్ణయ్యగారి మరణశాసనములలో చెప్పఁబడినది రాజమహేంద్రవరము ప్రథానస్థానముగాఁగల వితంతువివాహ సమాజమగు నాయని కార్యనిర్వాహక సంఘముయొక్క విశేష సభయందు చర్చింపఁ బడవలెను.)

5. That a special meeting of the managing committee be convened to discuss the question "What is the best way of administering Mr. Pida Ramakrishniah's Widow Marriage Fund. (పైడా రామకృష్ణయ్యగారి వితంతువివాహ నిధి నుపయోగించుట కేదియుత్తమమార్గమన్న ప్రశ్నను చర్చించుటకయి కార్యనిర్వాహక సంఘము యొక్క విశేష సభను సమకూర్పవలెను.)

6. That a special meeting of the managing committee to consider the above two questions be conened at 4 P. M. on the 9th instant at the Innespeta School house, and the members of the Assn. residing in this town be requested to attend this meeting." (పయిరెండు ప్రశ్నలను చర్చించుటకయి 9 వ తేది సాయంకాలము 4 గంటలకు ఇన్నీసుపేట పాఠశాలలో కార్యనిర్వాహక సంఘము యొక్క విశేషసభ సమకూర్పఁబడి, ఈపట్టణములో వాసము చేయుచున్న సమాజము యొక్క సభ్యులు పూర్వోక్త సభకు వచ్చునట్లు ప్రార్థింపఁబడవలెను.)

పయి నిర్ధారణ ప్రకారముగా 9 వ తేదిని సభ సమకూర్పఁ బడెనుగాని నాటిదినము లక్ష్మీనరసింహముగారు రానందున సభ 13 వ తేదికి విలంబింపఁ బడెను. ఆ 13 వ తేదిని సహితము లక్ష్మీనరసింహముగారు సభకు రాలేదు. నాఁడాయన లేకయే సభ జరపఁబడెను. ఆసభకు కార్యనిర్వాహక సంఘము వారుగాక మఱి 19 గురుసామాజికులువచ్చిరి. అందఱి యభిప్రాయములను గైకొన్న మీఁదట నీక్రింది నిర్ధారణులు చేయఁబడినవి-