పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/344

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

331



యెడల ఆకాలములో నెల 1 కి ఆరు రూపాయలచొప్పున సదరు పండ్రెండు కుటుంబములవారి మీద సమానముగా యేర్పర్చి సదరు ఆరు రూపాయీలు యియ్యవలశినది.

1886 వ సంవత్సరంకు వచ్చేవడ్డి ధనములో సలాది రామయ్యకు యిల్లు కట్టుకునేనిమిత్తం రెండువందల రూపాయీలున్ను దేవాలయపు హక్కు నిమిత్తం తణుకు వెంకటచలపతి తెచ్చిన అసలు వ్యాజ్యపు కర్చులకు మాత్రము అయిన ధనమున్ను మినహాయించి తక్కిన ధనము సమముగా పండ్రెండు భాగములుచేసి సదరు కుటుంబములలో యెవరికి అయినా కొంత సొమ్ము యావర్కు కర్చుపడినయెడల సదరు సొమ్ము వారి భాగములో మినహాయించి తక్కినసొమ్ము యియ్యవలసినది. సదరు వ్యాజ్యం గెలిచినయెడల వచ్చే పరిహారము పండ్రెండు కుటుంబములవారూ సమానముగా పంచుకోవలయును.

సదరు పండ్రెండు కుటుంబముల యజమానుల పేరులు (1) గోగులపాటి శ్రీరాములు, (2) రాచర్ల రామచంద్రరావు, (3) తాడూరి రామారావు పంతులు, (4) పులవర్తి శేషయ్య, (5) ముంజులూరి గోపాలకృష్ణయ్య, (6) సలాది రామయ్య, (7) బోడా శ్రీరాములు, (8) చేబోలు వెంకయ్య, (9) తణుకు వెంకట చలపతి, (10) నల్లగొండ కోదండరామయ్య, (11) పఠానేని వెంకయ్య, (12) వల్లూరి ముత్తమగారి కొమార్తె పున్నమ్మకాగల పెనిమిటి.

యీదిగువ వ్రాళ్లుచేసినవారు పైవిధులకు సమ్మతించినారు..

(1) రాచర్ల రామచంద్రరావు.

(2) పులవర్తి శేషయ్య.

(3) తణుకు వెంకటచలపతిరావు.

(4) పున్నమ్మ సంరక్షకురాలు వల్లూరి ముత్తమ్మ.