పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/338

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

325



అట్లాచేయడంయంతమాత్రమూ నాఉద్దేశముకాదు. వారినిమందలించడమైనది. వారుకాని మరియితరులుకాని ఆసమయమునందు మిమ్మునగాని మీపత్రికను గాని దూషించినయెడల అందుకు అపాలజీచేయుచున్నాను. మీవివేకవర్ధనిలో ఆదరిమిలాప్రచురింపబడిన హాశ్యసంజీవనివలె సర్వసామాన్యముగా అందరికి వర్తించునటుల ఉన్న యడలయవరికి బాధకరముగానుండదు గనుక ఆప్రకారముగా ముందునుండునని తలుస్తూవున్నాను.

6 ఆగష్టు 1886 వ సం||

తమ విధేయుడు

ఆ. ల. నరసింహము."

దంభాచార్యవిలసనములోని రెండవభాగమునందుండిన విషయము లెంతసర్వసామాన్యముగానుండినవో మొదటిభాగమునందలివియునంత సర్వ సామాన్యము గానే యుండినవి. రెండుభాగములలోను దంభాచార్యుఁడు మునసబుగాఁగాక తహశ్శీలుదారుగాఁజెప్పఁబడెను. మొదటి భాగములోని వన్నియు తహశ్శీలుదారుఁడుచేసినట్టే చెప్పఁబడినవి; రెండవదానిలొ కొన్ని యెవ్వరో డిస్ట్రిక్టు మునసబుచేసినట్టు తహశ్శీలుదారునిచోట పలికింపఁబడినవి. ఈరెంటికిని గల వ్యత్యాసమింతే. ఈరెంటిలోను విషయములట్టిలోపములు గల వారు తమ్ముద్దేశించియే వ్రాయఁబడినవని భావింపవచ్చును. ఇఁక చేసిన క్షమార్పణను వివేకవర్ధని యంగీకరించి యీ విషయమయి తాను వ్రాయఁదలఁచుకొన్న దానిని వ్రాయవలసియున్నది. వివేకవర్ధని మరల తీవ్రముగా వ్రాయక సౌమ్యముగా వ్రాయవలసిన చిత్తును న్యాపతి సుబ్బారావు పంతులుగారే వ్రాసి దానిని లక్ష్మీనరసింహముగారికి చూపి యాయన సరియన్న మీఁదట మరలఁదెచ్చి నాకిచ్చిరి. ఇదియంతయు జరగుటకుఁ గొంతకాల మాలస్యమయి నందున 1886 వ సంవత్సరము సెప్టెంబరునెల 8 వ తేదివఱకును క్షమార్పణ పత్రము స్వవ్యాఖ్యానముతో వివేకవర్ధనియందు ప్రకటింపఁబడలేదు. అందు చేత నీలోపల సెప్టెంబరునెల 6 వ తేదిని జరగిన స్త్రీ పునర్వివాహ సమాజము