పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/330

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

317



దమును వేయుచున్నాఁ డేకాని, ఆపెద్దమనుష్యునిమాట లెంతమాత్రమును సత్యములుకావు. వివేకవర్ధనిలో ప్రకటింపఁబడిన అర్థమువచ్చెడు మాటలనే నే నొకసారి మహారాజశ్రీ ఆత్మూరి లక్ష్మీనరసింహముగారితో ఆయన క్షేమమును సమాజముయొక్క వృద్ధియు కోరి చెప్పియున్నాను. ఆయేర్పఱిచెడు ట్రస్టీలలో నాపేరక్కఱలేదని కూడ నేనప్పుడాయనతో చెప్పియున్నాను. ఈవిషయమయి యెవ్వరికైయిన సందేహము కలిగియున్నపక్షమున, ఆలక్ష్మీనరసింహముగారినే అడిగి సత్యమును తెలిసికోవచ్చును. ఆయన యీవిషయమయి అసత్యమాడఁ బోరుగనుక, సత్యమందఱికిని వెల్లడికాక మానదు. ఈ విషయమయి నాయుద్దేశమేమో మాసమాజముయొక్క కార్యనిర్వాహక సభికులకందఱికిని తెలిసియున్నది. ఈధనము తనవశమునందుండవలెనని కోరుట వలన దానిని కాపాడుట మొదలయినదానియందు కష్టములును ఉత్తరవాదిత్వమును కలుగుటయేకాని యెవ్వరికి నేవిధమయిన లాభమును కలుగదు. ఎవ్వరయినను దాతయుద్దేశప్రకారము మూలధనమును ముట్టుకొనక భద్రముగా కాపాడి దాని వృద్ధిని సమాజమువారి కొప్పగింపవలసిన వారేకాని మనసు వచ్చినట్లు వినియోగపఱుపవలసినవారుకారు. ఇంతకంటె నేనిప్పుడధికముగా తెలుపవలసినదిలేదు.

కందుకూరి-వీరేశలింగము."

పయి యుత్తరము వచ్చినతరువాతను, అది నాయభిప్రాయముతో పత్రికలో ప్రచురింపఁబడు లోపలను, 1886 వ సంవత్సరము మెయినెల 9 వ తేదిని ఒక చిత్రకథ నడచినది. లక్ష్మీనరసింహముగారిమిత్రుఁడు సభకుపోయి నప్పుడెల్లతోడిన్యాయవాదులు మొదలైనవారాయనను "జంబుక శాస్త్రిగారు దయచేసినారా? జంబుకశాస్త్రిగారూ! విశేషములేమి?" అని పిలిచి హేళనముచేయ నారంభించిరఁట! ఆయనయు కలహప్రియులైన కొందఱు పెద్ద మనుష్యులును లక్ష్మీనరసింహముగారి యొద్దకుపోయి దంభాచార్యవిలసనము