పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/329

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

316

స్వీయ చరిత్రము.



వడ్డిని పునర్వివాహముల నిమిత్తమయి వినియోగ పఱుచుచుండ వలసినదని యేర్పఱిచినారు. అంత సొమ్మొక్కరి వశమున నుండుట క్షేమకరముకాదు గనుక లక్ష్మీనరసింహముగారు తగుమనుష్యులను మఱిముగ్గురు నలుగురినికూడ ట్రస్టీలనుగా తమతో చేర్చుకొని యాధనము స్థిరముగా దాతయుద్దేశ ప్రకారముగా వినియోగపడుటకు తగినమార్గమును సమాజమువారితోఁ గలిసి యాలోచించి యేర్పఱుతురని నమ్ముచున్నాము. అట్లుచేయుట సమాజమువారికి మాత్రమేకాక లక్ష్మీనరసింహముగారికిని మిగుల క్షేమకరము. ఒక్కరెంత మంచియుద్దేశముతో ధనవృద్ధినిమిత్తమయి పనిచేసినను దైవవైపరీత్యము వలన నష్టము సంభవించినయెడల దాతయొక్క మనోరధము విఫలమగుటయేకాక యాపనిచేసినవారికి నిందయువచ్చును. తాము మంచి యుద్దేశము కలవారయినను తమపుత్రులు మొదలైన వారట్టి సచ్చింతగలవారు కాకపోవచ్చును. కాఁబట్టి నిక్షేపధారులు పలువురయి యుండుట యుభయ పక్షముల వారికి సర్వవిధముల శ్రేయస్కరము. విశేషధన మొక్కరి చిత్తవృత్తి ననుసరించి యుండుటకంటె పలువుర యాలోచనకు లోఁబడియుండుట క్షేమకరము కాకపోవునా? కాఁబట్టి బుద్ధిమంతులగు లక్ష్మీనరసింహముగారు మఱియొక విధముగా నాలోచింతురని మేము భావింపము."

అయితే యీవూళ్లోవున్న వక పెద్దమనిషి వీరేశలింగంగారు ఆసొమ్ము తమకు కావలెనంటూవున్నారని వాడుక చేస్తూవున్నాడు. ఆమాటలలో యే మయినా నిజం వున్న దేమో మీపత్రికద్వారా తెలియచెయ్య కోరుతాను. చిత్తగించవలెను.

మీవిధేయుడు, సత్యకామి."

ఈయుత్తరమును నేను దీనికిచ్చిన యీక్రింది ప్రత్యుత్తరమును మెయి 19 వ తేది వివేకవర్ధనిలో ప్రకటింపఁబడినవి. -

"సత్యకామిగారు చెప్పినమాటలను వాడుకచేయుచున్న పెద్దమనుష్యుఁడు కేవల స్వప్రయోజనపరుఁడయి యేదో దురుద్దేశముతో పయి ప్రవా