నాల్గవ ప్రకరణము.
315
న్నాఁడు. తమరంతా దయచెయ్యవచ్చును.......(తనలో) ఈముండాకొడుకు కూడా నామాలు కడిగివేయక మునుపేవచ్చినాడే. వీళ్లనందరినీ సాగనంపి వీడి వద్ద యేదో మాయోపాయం పన్ను తాను.
కారు - (ప్రవేశించి) తహశ్శీల్దార్ ! వీరిని యెవరినీ పంపించవద్దు. వీరికి సత్యమతం కొంచెం బోధింతాము. మీవేదాలు సత్యమైనవి కావనిన్నీ బైబిలు వక్కటే సత్య వేదమనిన్నీ; కృష్ణుడు జారత్వమూ చోరత్వమూ చేసిన పాపి అనిన్నీ, రక్షకుడయిన యేసుక్రీస్తును కొలిస్తేనేకాని ముక్తిలేదనిన్నీ, జాతిబేధాలు పనికిమాలినవనిన్నీ, నిన్న మీరు మాయింట్లో చెప్పిన మాటలు వీరితో యెప్పుడయినా చెప్పినారా?"
ఆయన దీనిని చదివినతరువాతఁగూడ యధాప్రకారముగానే నాతో మాటాడుచుండిరి. రామకృష్ణయ్యగారి మరణశాసనములను నాకాయన చూపినప్పుడు మఱి యిద్దఱు ముగ్గురు ట్రస్టీలనుకూడ తమతో చేర్చుకొని పనిచేయుఁడని నేను చెప్పిన హితవచనముల కాయనయామోదించినట్లే మాటాడిరి. రామకృష్ణయ్యగారి మరణమునుగూర్చి యేప్రిల్ నెల 7 వ తేది ప్రకటింపఁబడిన వివేకవర్ధనిలోని వ్యాసములో నే నాయనతో మాటాడిన మాతల యర్థ మిచ్చెడు వాక్యములే యుండినవి. ఇవి ఇట్లుండఁగా మెయినెల మొదటి వారము తుదను సత్యకామియను పేరితో నొకరు వివేకవర్ధని కిట్లువ్రాసిరి -
"మహారాజశ్రీ వివేకవర్ధనీయెడిటరుగారికి.
అయ్యా, పైడా రామకృష్ణయ్యగారి చావునుగురించి వ్రాసిన వివేకవర్ధనిలో ఆయన కొత్తగాయిచ్చిన ఫదివేలరూపాయలనుగురించి యీ మాటలు కనపడుతూవున్నవి.
"అంతేకాక కార్యంతరముమీద మాడిస్ట్రిక్టు మునసపుగారయిన ఆత్మూరి లక్ష్మీనరసింహము గారక్కడకుపోయి యుండఁగా పదివేలరూపాయల ప్రోమెస్సరీ నోట్లను వారిచేతికిచ్చి, ఆసొమ్ము వ్యయపెట్టక దానిమీది