నాల్గవ ప్రకరణము.
311
యితర మండలములలో లంచములు పుచ్చుకొనుట కలవాటుపడి యాఱితేఱిన యొక ప్రాడ్వివాకుని మారాజమహేంద్రవరమునకుఁ బంపిరి. ఈయన లంచములు పుచ్చుకొనెడిరీతి పూర్వము పోలూరి శ్రీరాములుగారు పుచ్చుకొను చుండిన దానికంటె భిన్నమైనదిగా నుండెను. ఈయన సాక్ష్యము మొదలైన వానిని క్రమముగా పుచ్చుకొని, తీర్పు చెప్పఁబోవు సమయమున నుభయపక్షములవారినుండియు వారియ్యతగినంత మొత్తమును లంచముగా తెప్పించి తన యొద్ద నుంచుకొని, గ్రంథమునంతను న్యాయదృష్టితో చదివి, ఏదిన్యాయపక్షమో కనుఁగొని యాపక్షమువాఁడు పదిరూపాయల నిచ్చినను దానితోనే తృప్తినొంది వానిపక్షమే తీర్పుచెప్పి, యన్యాయపక్షము వాఁడిన్నూఱు రూపాయలిచ్చినను ఆమొత్తమును తిరిగి యిచ్చివేసెడివాఁడు. అందుచేత నాతని తీర్పును చూచినవాఁడెవ్వఁడును న్యాయముతప్పిన తీర్పని చెప్పఁజాలఁడు. అటువంటి ప్రౌఢుని లంచములను మాన్పవలెనని మావివేకవర్ధని పనిచేయఁ బూనెను. ఇతనివిషయమయి వ్రాయఁబడిన హాస్య సంజీవనిలోని సంభాషణలు చదివి కొన్నాళ్లు లంచములుమానివేసి యాఱునెలలు సెలవుపుచ్చుకొని తనపని మఱియొకచోటికి మార్చుకొనఁ బ్రయత్నించెనుగాని యున్నత న్యాయసభవారాతని ప్రార్థన నంగీకరింపనందున మరల మాపట్టణమునకే రావలసినవాఁడయ్యెను. రెండవసారి వచ్చినపిమ్మట నల్పకాలము శుద్ధవర్తనుఁడయియుండి తనయింటి కెవ్వరిని రాకుండఁజేయుటకయి భటులను కావలి యుంచెను. అయినను లంచములు మరిగి ధనార్జనమున కలవాటుపడిన హస్తము చిరకాలము రిక్తదశలో నుండచాలదు గనుక శీఘ్రకాలములోనే యతఁడు రహస్యముగా నధర్మథన స్వీకారమునకు చేయి చాప నారంభించెను. వెంటనే మావివేకవర్ధని విజృంభించి తనలేఖినీకృపాణోపేతమైన చేతినిచాచి యన్యాపదేశముగా వ్రాయుచు లంచములకయి చాచెడి యాతనిచేతిని ముడిపింప పోరాడఁదొడఁగెను. వివేకవర్ధనిధాటికి తాళఁజాలక యతఁడు మరల సెలవు