నాల్గవ ప్రకరణము.
307
రమున కియ్యనిపక్షమున నతఁడిల్లులేక చిక్కులుపడవలసివచ్చుననియు, ఇప్పుడే యిల్లద్దెకియ్య మనెడు పక్షమున మూడవ నిర్ధారణ ప్రకారముగా నతిని కట్టించి యిచ్చువఱకును యథాప్రకారముగా నతనిని నడిమిభాగములోనే యుంచి గృహవిభాగము తరువాత చేయవచ్చు ననియు, ఇల్లిచ్చెదమనెడు పక్షమున సంవత్సరకాలమద్దెకు పుచ్చుకొని యతని నందులో కాపురముపెట్టి యీసంవత్సరములోపల నిల్లుకట్టించి యియ్యవచ్చుననియు, ఉద్దేశించి యీ కడపటి యయిదాఱు నిర్థారణములు రెండును చేయఁబడినవి. వితంతువివాహ పక్షమునం దభిమానముగలవాఁడును పెద్దాపురములో ప్రాడ్వివాకుఁడు (Dt Miff)గా నున్న వాఁడును అయిన మల్హరిరావు పంతులుగారు కోదండరామయ్య గారికి తనకార్యస్థానములో రు. 15 లు జీతముగల లేఖకోద్యోగము నిచ్చినందున ఆయన యక్కడకు పోవునప్పుడు పూర్వోక్త నిర్ధారణానుకూలముగా నిల్లద్దెకిచ్చుట కంగీకరింపఁగా నద్దెచీటివ్రాసిపుచ్చుకొని యథాపూర్వముగా పటానేని వెంకయ్యగారి కుటుంబము నందుంచితిమి. పిమ్మట లక్ష్మీనరసింహముగా రిల్లు రెండుభాగములుచేసి కోదండరామయ్యగారి కర్థభాగమిచ్చిరి.
ఏప్రిల్ నెల 3 వ తేదిని చేయఁబడిన నిర్ధారణ ప్రకారముగా మరణ శాసనములను రెంటిని గొనిపోయి లేఖ్యారూఢము చేయించుటకయి సమాజ సహాయకార్యదర్శియైన సోమంచి భీమశంకరముగారు లక్ష్మీనరసింహము గారి యొద్దకుపోయి యడుగఁగా, పదివేలరూపాయల మరణశాసనమును తన యొద్దనే యుంచుకొని మిగిలిన మరణశాసనము నొక్కదసనినే నరసింహము గారిచ్చినందున భీమశంకరము గా రొక్క మరణశాసనమును మాత్రమే 1886 వ సంవత్సరము మెయినెల 6 వ తేదిని సహాయలేఖ్యారూఢాధికారి (Sub Registrar) యెదుటఁ బెట్టవలసినవాఁడయ్యెను. లక్ష్మీనరసింహముగారు జూన్ నెల 26 వ తేదిని సహాయలేఖ్యారూఢాధికారి కార్యస్థానమునకుపోయి మరణశాసనము రామకృష్ణయ్యగారు వ్రాసి యిచ్చినట్టు సాక్ష్యమిచ్చెను.