పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/318

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

నాల్గవ ప్రకరణము.

305



రు. 500-0-0 అయిదువందలరూపాయీలు నగదుయిచ్చి ఆయనకు యిస్తానన్న భాగముకూడా నాకుమాళ్లవశంలో వుండగలందులకు యేర్పర్చడమైనది." అని యనుశాసనమును చేర్చిరి.

రామకృష్ణయ్యగారి మరణానంతరమున వారు వితంతువివాహసమాజమువారి పక్షమున వ్రాసియిచ్చిన మరణశాసనములను రెంటిని ఆత్మూరి లక్ష్మీనరసింహముగారు తీసికొనివచ్చి సమాజమునకిచ్చిరి. ఆయన సమాజమువారి కోశాధ్యక్షుఁడయినందున తెచ్చిన మరణశాసనములు రెండును లక్ష్మీనరసింహముగారియొద్దనే యుంచఁబడెను. 1886 వ సంవత్సరము ఏప్రిల్ నెల 3 వ తేదిని జరగిన సమాజముయొక్క కార్యనిర్వాహక సంఘమువారి సభలో నీక్రిందినిర్ధారణము చేయఁబడినది.

"5. That the wills executed by late Ramakrishniah Garu in favour of the Association be registered." (సమాజమున కనుకూలముగా గతించిన రామకృష్ణయ్యగారిచే చేయఁబడిన మరణశాసనములు లేఖ్యారూఢములు చేయఁబడవలెను.)

ఈనిర్ధారణముక్రింద నగ్రాసనాసీనుఁడుగానుండిన మాకర్లసుబ్బారావు నాయఁడు బీ. ఏ., బీ. ఎల్., గారిచేతను, ఆత్మూరి లక్ష్మీనరసింహముగారి చేతను, బసవరాజుగవర్రాజుగారిచేతను, నాచేతను, న్యాపతిసుబ్బారావు పంతులుగారిచేతను, వ్రాళ్లుచేయఁబడెను. నాఁడు జరగిన యీకార్యనిర్వాహక సంఘసభలో పయినివ్రాళ్లుచేసినవారు మాత్రమేకాక సోమంచి భీమశంకరము గారును ఆచంట లింగరాజు గారునుకూడ నుండిరి.

మఱియాఱుదినముల కనఁగా 1886 వ సంవత్సరము ఏప్రిల్ 9 వ తేదిని లక్ష్మీనరసింహముగా రగ్రాసనాసీనులుగానుండి జరపిన కార్యనిర్వాహక సంఘ సభయం దీక్రింది నిర్ధారణములు చేయఁబడినవి.

"3. That as soon as funds permit a house be built in the Vacant site bought at Innespeta at a cost of between two and