పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/309

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

296

స్వీయ చరిత్రము.



బిలిపించుకొని నాపయిని దోషారోపణములు చేయుచు సమాజమువారికి విన్నపములు పంపునట్లు వారిని పురికొల్పఁజొచ్చిరి. రాజమహేంద్రవరములోనున్న వారిలో నొకరిద్దఱు మాత్రము బాల్యమగుటచే యుక్తా యుక్త వివేకము లేక వారిదుర్బోధనలకు లోఁబడి వారు వ్రాయించియిచ్చిన యుత్తరములను సమాజమువారికిఁ బంపిరి. వారిలో నొక్కరైన తణుకు చెలపతిరావుగారు తన వివాహములో నియ్యఁబడిన కట్నములను తనకియ్య లేదు గనుక నాయొద్దనున్న బట్టలను తనకిప్పింపుమని సమాజమున కొక విన్నపమును బంపెను. సమాజమువా రావిన్నపమును వెంటనే నిరాకరించిరిగాని యటుతరువాత నతఁడు తన్ను ప్రోత్సాహపఱిచి విన్నప మిప్పించిన వారి పేరులుచెప్పి క్షమార్పణముచేసిన మీఁదట నాయొద్ద నిలువయున్న నాలుగు బట్టలను అతనికిచ్చి వేసితిని. ఆతని వివాహమునకు చెన్న పట్టణములో 17 బట్టలు కట్నములు చదివింపఁబడినవి. వధూవరులకు మధుపర్కములు మొదలయినవానికి పెండ్లిలో కావలసిన వస్త్రముల నన్నిటిని మేమే యక్కడకొనియిచ్చితిమి. కట్నములిచ్చిన 17 బట్టలలో కొన్ని చీరలు; కొన్ని పంచెలు; కొన్ని యెక్కువ వెలగలవి; కొన్ని తక్కువ వెలగలవి. వీనిలో మంచిబట్టలను రెంటిని చెన్న పట్టణములో వధూవరులకిచ్చితిని. ఒకచీర వరుని మఱదలికిచ్చితిని; ఒకచీర నాభార్యకిచ్చితిని; రెండువస్త్రములను వివాహమునకువచ్చిన రామారావుగారికిని ఆయన భార్యకును (మూడవ వివాహదంపతులు) ఇచ్చితిని; సామాన్యపు బట్టలు రెండు మావెంటవచ్చిన మునిసామికిని అతనిభార్యకును ఇచ్చితిని; ఒకబట్టను చెలపతిరావు మఱదలిని పెండ్లియాడు తలంపున మాతోవచ్చిన ప్రకాశరావుగారికిచ్చితిని; రెండుబట్టలు కాకినాడ వచ్చిన పిమ్మట బోడా శ్రీరాములకును అతనిభార్యకును (ఏడవ వివాహదంపతులు) ఇచ్చితిని; రెండు మంచి వస్త్రములను రాజమహేంద్రవరము వచ్చిన తరువాత గర్భాధానసమయమున వధూవరులకిచ్చితిని. ఇవి పోఁగా మిగిలియున్న నాలుగు బట్టలను సమయము వచ్చినప్పుడు వధూవరులకిచ్చుటకయి నాయొద్ద