పుట:Sweeya Charitramu VOLUME 01 Kandukuri Veeresalingam 1911 414 P 2020010023927.pdf/258

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

244

స్వీయ చరిత్రము.



ములో కూలివానిని సంపాదించుట కష్టమైనందునను, లేశమైనను సంశయింపక దురభిమానమునువిడిచి కార్యసాధనమే ముఖ్యప్రయోజనముగా చూచుకొని తానే కావడిని కొన్ని క్రోసులదూరము మోచుకొనివచ్చి యీ శేషయ్యగారే వారిని మాయింటికిఁదెచ్చి యొప్పగించెను. ఇప్పుడు కోదండరామయ్యగారికిచ్చి వివాహము చేయఁబడినది యీచిన్నదే. వరుఁడైన కోదండరామయ్య ప్రథమశాఖవాఁడు ; వధువు వైదికశాఖాసంభవ. శాఖాభేదము విచారింపకచేసిన వివాహములలో నిదియే మొదటిది. ఇంతవఱకును జరగిన వివాహములన్నియు నియోగులలో నియోగులకును, మాధ్వులలో మాధ్వులకును, వైదికులలో వైదికులకును, కోమట్లోలో కోమట్లకును, శాఖాభేద మతిక్రమింపక జరుపఁబడుచువచ్చినవి. ప్రథమవివాహము చేసికొన్న దంపతుల కొక్కరికిఁ దక్కతక్కిన వారికందఱికి కాపురములుండుటకు గృహము లీయఁబడుచు వచ్చినవి. మొట్టమొదట నిన్నీసుపేటలో కొనబడిన యింటిలో దక్షిణభాగము రెండవ వివాహముచేసికొన్న రాచర్ల రామచంద్రరావుగారికిని, ఉత్తరభాగము నాలవ వివాహముచేసికొన్న పులవర్తి శేషయ్యగారికిని, ఇయ్యఁబడినవి. మూఁడవ వివాహముచేసికొన్న తాడూరి రామారావుగారికి సూర్యరావుపేటలో నొక గృహముకట్టించి రామకృష్ణయ్యగా రిచ్చిరి. అయిదవ వివాహముచేసికొన్న మంజులూరి గోపాలకృష్ణయ్యగారికి శేషయ్యగారియింటిప్రక్కను క్రొత్తగా కట్టింపఁబడిన యిల్లియ్యఁబడినది. ఇన్నీసుపేటలో మంజులూరి వారివద్ద స్థలముకొని కట్టించిన యింటిలోని దక్షిణభాగ మెనిమిదవ వివాహచేసికొన్న తణుకు చెలపతిరావుగారి కియ్యఁబడినది ; ఉత్తరభాగ మాతని మఱదలికి వివాహమైనప్పుడిచ్చుటకు నిలువయుంచఁబడినది. మా యింటిసమీపమున కొనఁబడిన పేరిచయనులుగారి యింటిలోని యుత్తరభాగ మాఱవ వివాహముచేసికొన్న చేబోలు వెంకయ్యగారికిని, దక్షిణభాగము పదవ వివాహముచేసికొన్న నల్లగొండ కోదండరామయ్యగారికిని, ఇయ్యఁబడినవి. ఏడవ వివాహము చేసికొన్న బోడా శ్రీరాములుగారికి రామకృష్ణయ్యగారు