నాల్గవ ప్రకరణము.
209
నందు తానిఁకముందు రాజమహేంద్రవర వితంతు వివాహసమాజము వారికి సొమ్ము పంపననిచేసిన రెండవ ప్రతిజ్ఞయు చెల్లినది. - ఎట్లనఁగా మాకుచెన్నపట్టణమువారుపంపుదురుగాని రామకృష్ణయ్యగారు స్వయముగా సొమ్మియ్యరు; వితంతు వివాహముల నిమిత్తమయి సొమ్మిచ్చెదనన్న మొదటిప్రతిజ్ఞయు చెల్లినది. - ఎట్లనఁగాసొమ్మును మాకు చెన్నపురివారే పంపినను సొమ్ము రామకృష్ణయ్యగారిచ్చినదే. ఈవిషయములో మాకు కృష్ణస్వామిరావు పంతులుగారుచేసిన మహోపకారమును మేమెప్పుడును మఱవఁజాలము. ఈపదివేల రూపాయలును పంపినకాలములో మరల వివాహములు జరుగునన్న నమ్మకము రామకృష్ణయ్యగారి కెంతమాత్రమునులేదు. సొమ్మును చెన్నపట్టణము పంపినప్పుడు రామకృష్ణయ్యగారు చెంచలరావు పంతులుగారిపేరను రఘునాధరావుగారిపేరను వ్రాసిన యుత్తరములో రెండుసంవత్సరములలోపల వివాహములు జరగనిపక్షమున తమసొమ్ము తమకు మరల పంపివేయునట్లును, వివాహములయ్యెడు పక్షమున చెన్న పట్టణపు సమాజమువారు రెండువివాహములకు రెండువేలరూపాయలను వ్యయపఱుచు కొనునట్లును వ్రాసి, వివాహములు జరగెడిపక్షమున వివాహమొక్కంటికి వేయేసిరూపాయలచొప్పున నాయొద్దకు పంపుచుండవలసినదనియు వ్యయములక్రింద జూన్ నెల మొదలుకొని నెలకు డెబ్బదియైదు రూపాయలచొప్పున నాకుఁ బంపుచుండవలసినదనియు వ్రాసిరి.
ఏప్రక్కనుజూచినను కష్టములే కనఁబడుచు, మరల వితంతు వివాహము లగు నన్న యాశ కవకాశములేక, పూనినకార్య మకాలనాశనము నొందునట్ల గపడుచున్న యాకాలములో ఏలాగునైన కొన్ని వివాహములుచేసి యిటువంటి సత్కార్యవృక్షము మనుష్యకుటిలప్రయత్నములవలన నిర్మూలము కానేరదని లోకమునకు చూపవలెనని మేము మఱింత ధైర్యోత్సాహములతో బహుప్రయాసములకోర్చి పనిచేయసాగితిమికాని మొట్టమొదట మాకృషిసఫలమగునట్లు కనఁబడలేదు. ఆవఱకు తమవితంతు కన్యలకు వరులను విచారించి వివాహముచేయుఁడని మమ్ము బతిమాలుకొన్న వారి కడకు పోయి మేమే బతి