పుట:Srinadhakavi-Jeevithamu.pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

36

శ్రీనాథ కవి

కంటిని విశుద్ధసతిని
వింటిన బురాణములు పెక్కులు విశ్వము నొగడన్
మంటి బహువత్సరంబులు
గొంటి యశోధరము సుకవి తోటి నుతింపన్

కృతి నందిన యవచితిప్పయ్య వృద్ధయిన నాతని బాలసఖుఁడు గూడ వృద్ధుడే కావలయునుగదా". మా లెక్క ప్రకారము హరవిలాసము రచనా కాలము (1400) వఱకు శ్రీనాథుడు నలువ ఏయేండ్ల వాఁడుగ నున్నాడు. కావున ఈపూర్వపక్షమంత బలవంతమైనది కాదు. మఁటి బహువత్సరంబులు అని యేఁబది యేండ్లు సమీపించినవాడవ వచ్చును. బాలసఖుఁడు" అనఁగానే తూచినట్లిద్దఱికిని ఒక్కటే వయస్సుండనక్కర లేదు. ఇద్దఱికి నేఁడెనిమిది సంవత్సరములు భేదముంగనచ్చును. శ్రీనా థుఁడు చిన్న నాఁడే పెద్దబుద్ధులుగల యప్రతిమ ప్రతిభాశాలి గనుక నాతనికంటెఁ పెద్ద వారుకూడ నాతనితోఁ జెలిమి నేసీ యుండుట యాశ్చ ర్యము కాదు." అని చులకనఁగాఁ ద్రోసి రాజనిరి. ఇంక వీరేశలింగము గారన్ననో విచిత్రమైన మార్గ మవలంబించిరి. ఉభయులను శైవ మతస్థులగుట చేతనోమఱి యే హేతువు చేతనో యట్టి ప్రయాణములయందు శ్రీనాథునకు కుమారగిరిభూపాలుని సుగంధభాండా గారధ్యక్షుడయి కోటీ శ్వరుఁడుగానుండిన యనచితప్పయ సెట్టితోడి మైతి కలిగినది. అందుచేతనే శ్రీనాథుఁడు తిప్పయు సెట్టికి బాలసఖు డయ్యెను. అప్పటికి శ్రీనాథుఁదిరువదియైదు ముప్పది సంవత్సరముల బాలుఁడే యయినను తిప్పయ సెట్టి యాతనికంటె మిక్కిలి పెద్దవాఁడయి యుండును. కొండవీటియందు తప్పు శ్రీ నాథున కనచితిప్పయ సెట్టితోడి మైతి కలుగుట కసకాశము వేరొక చోట గానఁబడదు. శ్రీనాథుఁడు నైషధరచనా సంతరమునఁ దన బాల సఖుఁడైస తిప్పయ సెట్టిని జూచి సమ్మానమును బొందుటకు మ రల గొండవీటికిఁ బోయెను. అప్పుడు శ్రీనాథుఁడు ధనస్వీకారము చేసి హరవిలాసమును రచించి తిప్పయ్య పెట్టి కంకిత మొనర్చెను." అని :